ఆరో తేదీన గుంటూరుకు మోడీ..! ఏం చెప్పుకుంటారు..?

నాలుగున్నరేళ్ల కాలంలో.. ఏ ఒక్క అభివృద్ధి పని ప్రారంభోత్సవానికి అమరావతికి వచ్చే ప్రయత్నం చేయని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఇప్పుడు రాజకీయ పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి.. చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఓట్ల వేట కోసం మరోసారి ఏపీకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల ఆరో తేదీన మోడీతో గుంటూరులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. నాలుగున్నరేళ్లలో ఏపీకే కేంద్రం చేసిన సాయాన్ని… అభివృద్ధికి అండగా ఉన్న వైనాన్ని చెబుతామని కన్నా అంటున్నారు.

మోడీ ఏం చెప్పుకుంటారన్నదే… ఇప్పుడు ఆసక్తికరగా మారింది. ప్రత్యేకహోదా ఇచ్చారా..? రైల్వే జోన్ ఇచ్చారా..? స్టీల్ ప్లాంట్ ఇచ్చారా..? పోర్ట్ ఇచ్చారా..? మోడీ భాషలో ఢిల్లీని మించిన రాజధానికి .. కనీసం నిధులిచ్చారా..? … ప్రజల్లో పాతుకుపోయిన ప్రశ్నలు ఇవి. వీటి సంగతి చెప్పకుండా.. పన్నుల్లో వాటాల ప్రకారం.. రాజ్యాంగబద్ధంగా ఏపీకి రావాల్సిన నిధులు.. ఉపాధిహామీ పనుల నిధులు చెప్పి… తాము ఏపీ పట్ల ఉదారంగా ఉన్నామని చెప్పుకుంటే… ప్రజలు అంత అమాయకులు కాదుగా..!. ప్రతి రాష్ట్రంలోనూ.. న్యాయబద్ధంగా ఉండాల్సిన విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి వాటిని పేపర్ల మీద పెట్టి… పదేళ్లు, ఇరవై ఏళ్లు అయినా పూర్తి కాని విధంగా అరకొరగా నిధులు కేటాయిస్తూ…అదే తమ ఘనత అని చెప్పుకుంటారా..?. హామీలన్నింటికీ.. చట్టంలో పరిశీలించమని ఉందని.. తాము పరిశీలించేమని.. ప్రకటించుకుంటారా..?

2014 ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్పిన దానికి నాలుగున్నరేళ్లలో ఏపీకి చేసిన దానికి పొంతనే లేదు. ఏపీని అత్యంత దారుణంగా అవమానించారు కూడా. చరిత్రలో ఇంత వరకూ ఓ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆ రాష్ట్ర ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్న సందర్భం లేదు. ఆ కక్ష సాధింపును మొదటి సారి ఏపీపై చూపింది కేంద్రం. యూసీల పేరుతో.. పార్టీ నేతల్ని పంపి హడావుడి చేశారు. చివరికి యూసీలన్నీ సమర్పించారని.. నిధులు మంజూరు చేయాలని.. సంబంధిత.. నీతిఆయోగ్ స్పష్టమైన సూచన చేసినపప్పటికీ మోడీ నిధులివ్వలేదు. ఇంత దారుణంగా అవమానిస్తూ కూడా.. మోడీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి ధైర్యంగా వస్తున్నారు. అదే ఏపీ ప్రజలు పాటించే విలువలేమో..? దీన్నే బీజేపీ నేతలు చేత కాని తనంగా భావిస్తున్నారేమో..? తమిళనాడులో అయితే.. మోడీ వస్తున్నారు.. అని తెలియగానే.. అందరూ స్టిఫ్ అలర్ట్ అయిపోతారు..! ఆ దెబ్బకు ఆ టూర్ క్యాన్సిల్ అయిపోయేది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close