సాక్ష్యాలివ్వాలని చంద్రబాబుకు పోలీసుల నోటీసులు..!

చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓంప్రతాప్ మృతి విషయంలో ఆధారాలు ఇవ్వాలంటూ… పోలీసులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అదీ కూడా సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం.. ఇచ్చారు. నోటీసు అందిన వారం రోజుల లోపు నేరుగా తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి పేరు మీదుగా నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో.. “పెద్దిరెడ్డి బెదిరింపులతోనే.. డీజీపీకి చంద్రబాబు లేఖ” అనే పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.

అందులో ఆరోపించినవాటికి ఆధారాలు కావాలని… లేఖలో పోలీసులు పేర్కొన్నారు. గత వారం.. తెలుగుదేశం పార్టీ నేతలు.. దళిత యువకుడు ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. అదే రోజున.. ఎస్పీ ఓంప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడే పెద్దిరెడ్డి బెదిరింపుల వల్లే ఓం ప్రతాప్ చనిపోయాడని ఆరోపించిన వారికి నోటీసులు పంపుతామని హెచ్చరించారు. ఆ ప్రకారం.. చంద్రబాబుకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు నేరుగా.. డీజీపీకే లేఖ రాశారు.

డీజీపికి లేఖ రాసినట్లుగా పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు పంపడం… ఈ మొత్తం వ్యవహారంలో ఓ ట్విస్ట్. ఓం ప్రతాప్ మృతి వ్యవహారంలో ఇప్పటికీ.. చిత్తూరు జిల్లాలో అనేకరకాల చర్చోపర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని దూషించడమే… ఆయన మరణానికి కారణం అన్న చర్చ జరుగుతోంది. తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో.. పోలీసులు ఆధారాలు అంటూ.. ప్రతిపక్ష నేతకు నోటీసులు జారీ చేయడం..జకీయ ఆరోపణలకు పోలీసులు స్పందించడం.. వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close