ఉద్యోగుల మిలియన్ మార్చ్‌ పై పోలీసుల ఫ్లాగ్ మార్చ్ !

సీపీఎస్ ఉద్యోగులు మిలియన్ మార్చ్‌కు పిలుపునిస్తే ప్రభుత్వం నెల రోజుల ముందు నుంచే కంగారు పడుతోంది. గత పదిహేను రోజులుగా సీపీఎస్ ఉద్యోగులుకు పోలీసులను పంపి నోటీసులు ఇస్తోంది. ఆ నోటీుల్లో బహిరంగ బెదిరింపులు ఉన్నాయి. అయినా సరే ఉద్యోగులు వెల్లువలా వస్తారని భయపడుతోంది. అందుకే విజయవాడ చుట్టూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఉద్యోగ సంఘ నేతల ఫోన్లపై పూర్తి స్థాయిలో నఘా ఉంచారు.

అంతే కాదు.. ఒకటో తేదీకి ఇంకా ఐదు రోజులు ఉండగానే విజయవాడను పోలీసుల మయం చేశారు. విజయవాడ, గుంటూరుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని లాడ్జిలు.. హోటల్స్ అన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. కొత్త వాళ్లకి ఎవరికీ రూములివ్వొద్దని ఆదేశిస్తున్నారు. ఎవరైనా వచ్చి ఉంటే.. వారికి భయం కల్పించేందుకు భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్ ను కూడా విజయవాడలో నిర్వహించారు.తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం నుండి బీఆర్టీఎస్ రోడ్ వ‌ర‌కు పోలీసులు ఆయుధాలతో చేసిన ప్రదర్శన .. ఏదో జరగబోతోందన్న అభిప్రాయాన్ని .. భయాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు.

ఫ్రిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన ఉద్యోగ సంఘాల ఛ‌లో బెజ‌వాడ ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఈ సారి అలాంటిది జరిగితే పరువు పోతుందని ప్రభుత్వం అనుకుంటోంది. అసలు సీపీఎస్ ఉద్యోగులు.. అసలు ముట్టడి కోసం తాడేపల్లి వెళ్లనున్నారు. సీఎం ఇంటికే వెళ్తామంటున్నారు. అందుకే పోలీసులు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం ఇంటి వైపు ఎవర్నీ పోనివ్వకుండా ఇప్పటి నుంచే ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close