గ్రేటర్ ఎన్నికలలో కేవలం 45.25 శాతం పోలింగ్ నమోదు

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసాయి. ఒకదానినొకటి చాల ఘాటుగా విమర్శించుకొన్నాయి. తమకే వంద సీట్లు వచ్చేస్తాయని లేకుంటే పదవులకు రాజీనామాలు చేసేస్తామని ఒకరంటే..వస్తే రాజకీయాలను, తెలంగాణా గడ్డని కూడా విడిచిపెట్టి వెళ్లిపోతామని మరొకరు భీకర శపధాలు చేసుకొన్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏమేమి చేయాలో రాజకీయ పార్టీలు అన్నీ చేసాయి. కానీ ‘ఎగిరెగిరి దంచినా అంతే కూలి…రోటి కాడ పాడినా అంతే కూలి’ అన్నట్లుగా ఎండకన్నెరుగని రాజకీయనాయకులు కాళ్ళు అరిగిపోయేలా గ్రేటర్ మురికి గల్లీలలో తిరిగి ఎంతగా ప్రచారం చేసినా, ఎంత ప్రాయసపడినా ఓటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలిరాలేదు. కేవలం 45.25 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కనీసం 50 శాతం పోలింగ్ కూడా నమోదు కాకపోవడం చూస్తే గ్రేటర్ ప్రజలకు ఈ ఎన్నికలపై ఎంతటి నిరాసక్తత కలిగి ఉన్నారో అర్ధం అవుతోంది.

అధికార తెరాస, ప్రతిపక్ష తెదేపా, బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి. అయినా గ్రేటర్ ప్రజలు వారి సమస్యలను, వాదనలను, విమర్శలను, వాగ్దానాలను పట్టించుకోలేదని స్పష్టమయింది. ఇంత తక్కువ శాతం పోలింగ్ నమోదు అవడం వలన అధికార పార్టీ ఆశించినన్ని సీట్లలో సగం కూడా వస్తాయో రావో అనుమానమే. మరొక రెండు రోజుల్లో ఎలాగు ఫలితాలు వెలువడబోతున్నాయి కనుక తినబోతూ గారెల రుచి ఎలాగ ఉంటుందో అని ఆత్రుత పడవలసిన అవసరం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close