ఆంద్ర ఎమ్మెల్యే బాలకృష్ణ గ్రేటర్ లో ఓటు ఎలాగ వేస్తారు?

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లో నివాసం ఉంటునప్పటికీ తెలంగాణాకు సంబందించిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఏవిధంగా ఓటు వేస్తారు? అని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆవిధంగా ఓటు వేయకూడదు కనుక ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఆంధ్రాలో ఎమెల్యేగా ఉన్న వ్యక్తి అయన స్వంత రాష్ట్రంలోనే ఓటు వేసుకోవాలి కానీ పొరుగు రాష్ట్రంలో ఏవిధంగా వేస్తారని ఆయన ప్రశ్నించారు.

పొన్నం వాదన సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, బాలకృష్ణకి హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్నప్పుడు ఆయన అక్కడ ఓటు వేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. అందుకే ఎన్నికల సంఘం ఆయనను ఓటు వేయడానికి అనుమతించింది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి కూడా హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉండి ఉంటే, ఆయన కూడా గ్రేటర్ ఎన్నికలలో తప్పకుండా ఓటు వేసేవారు. ఆయన కుటుంబ సభ్యులు అందరికీ హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉంది కనుక అందరూ అక్కడే ఓటు వేసారు. బాలకృష్ణకి కూడా అదే నియమం వర్తిస్తుంది. ఆయన ఆంధ్రాలో ప్రజాప్రతినిధి కావడం చేత, పొన్నం ప్రభాకర్ కి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనుకోవాల్సి ఉంటుంది.
ఈ సంగతి ఎలా ఉన్నా బాలకృష్ణ, హరికృష్ణ, నారా లోకేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవి వంటి ఆంధ్రా నేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వంటి వారు వచ్చే ఎన్నికలలో ఆంధ్రా నుండి పోటీ చేయాలనుకొంటే తప్పనిసరిగా తమ ఓటు హక్కుని ఆంధ్రాలోకి మార్పించుకోవలసి ఉంటుంది. లేకుంటే ఎన్నికలలో పోటీ చేయలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close