చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా పిటిషన్ వేయించి జగనే పెట్టించారని తేల్చి చెప్పారు. ఇప్పుడు పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఏఏజీ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టేశారు. ఆయన అలా పెట్టడం.. రాజకీయ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా తాను ఏఏజీ హోదాలో ప్రెస్ మీట్ పెట్టడం లేదని చెప్పి.. షర్మిలపై ఆరోపణలు చేశారు.

అయితే తన ప్రెస్ మీట్ మొత్తం మీద తాను వైఎస్ఆర్ పేరును చార్జిషీటులో పెట్టాలని పిటిషన్ వేయలేదని చెప్పలేదు. వేశానని చెప్పుకున్నారు. కానీ ఆయన జగన్ ఎలా నిందితుడు అవుతారని..జీవోలు ఇచ్చింది ఆయన కాదని పిటిషన్ వేశానని చెబుతున్నారు. అంటే.. వైఎస్ఆర్ మాత్రమే ఆ పని చేయగలరని.. ఆయన మాత్రమే నిందితుడు అవుతారని పొన్నవోలు పిటిషన్ వేసినట్లు. అయితే అసలు విషయం చెప్పకుండా.. జగన్ ను వేధిస్తూంటే చూడలేక పిటిషన్ వేశానని చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఆ పిటిషన్ వేసినప్పుడు జగన్ ఎవరో తెలియదట. జగన్ ఎవరో తనకు తెలియకుండానే పిటిషన్ వేశారట. ఆయన పిటిషన్ ద్వారా వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో చేరితే జగన్ పిలిచి ఏఏజీ పదవి ఇచ్చారట.

శంకర్ రావు పిటిషన్ వేశారని.. ఎరన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారని పాత కథ అంతా పొన్నవోలు చెప్పుకొచ్చారు కానీ..తన పిటిషన్ గురించి మాత్రం ఆయన అరకొర సమాచారం చెప్పారు. జగన్ కు సంబంధం లేదని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ తనకు ఈ పటిషన్ వేసినందుకు పదవి ఇవ్వలేదని తన టాలెంట్ ను చూసి ఇచ్చారన్నారు. ఈ మధ్య కాలంలో నా టాలెంట్ షర్మిల చూడలేదా అని కూడా ఆయన డైలాగ్ చెప్పారు. మొత్తానికి ఒక్కో విషయం బయటకు వచ్చే కొద్దీ వైఎస్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close