పూజా హెగ్డే క‌ల తీరింది

బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజ్యం ఏలుతున్న క‌థానాయిక‌ల‌కు ఆ ఆశ‌లు ఇంకాస్త ఎక్కువ‌. ఆ అవ‌కాశాలు కొంత‌మందికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోతుంటాయి. పూజా హెగ్డేకీ అంతే. త‌న ప్ర‌యాణం బాలీవుడ్ తోనే మొద‌లైంది. అయితే.. క్ర‌మంగా సౌత్‌కి వ‌చ్చేసింది. ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు రావ‌డం, క్రేజ్ పెర‌గ‌డంతో తెలుగునాట బిజీ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త‌నే. అయితే బాలీవుడ్ కి వెళ్లాల‌ని, అక్క‌డ ఓ మంచి సినిమాతో త‌న‌ని తాను నిరూపించుకోవాల‌ని అనుకుంది. హౌస్‌ఫుల్ 4లో ఆ అవ‌కాశం వ‌చ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఆ ఫ్లాపుతో పూజాకి ఇక బాలీవుడ్ దారులు మూసుకుపోయిన‌ట్టే అనుకున్నారు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ ఛాన్స్ వ‌చ్చింది. రోహిత్ శెట్టి `స‌ర్క‌స్‌`లో పూజాని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడు. రోహిత్ శెట్టి మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. త‌న సినిమా అంటే.. బాక్సాఫీసు ద‌గ్గర మంచి క్రేజ్ ఏర్ప‌డుతుంది. పైగా ర‌ణ‌వీర్ సింగ్ యూత్ ఐకాన్‌. ఈ కాంబో పై మంచి అంచ‌నాలే ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులో ఛాన్స్ దొర‌క‌డంతో.. పూజా ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది. `ఈక్ష‌ణంలో ఎంత ఆనందంగా ఉన్నానో చెప్ప‌లేను` అంటూ ట్వీట్ చేసింది పూజా. ఈ సినిమాతో పూజా క‌ల నెర‌వేరిన‌ట్టే. కాక‌పోతే.. ఇలాంటి అవ‌కాశాలు త‌న‌కు ఇది వ‌ర‌కూ వచ్చాయి. కానీ త‌న ఖాతాలో హిట్ ప‌డలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరితే…. పూజా క‌ల నెర‌వేరిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close