వేల కోట్లు ఉన్నా వైసీపీలో ఉంటే మాత్రం పేదలే !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదో మాయా ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. తాను చెప్పేదే కరెక్ట్.. తాను చేసేదే మంచి అనుకుంటూ ఉంటారు. తాను అబద్దాలు చెప్పినా అది ప్రజలే కోసమే అనుకుంటూ ఉంటారు. అందుకే ఎదుటివారు నవ్వుకుంటారన్న కామన్ సెన్స్ లేకుండా నిర్మోహమాటంగా అబద్దాలు ప్రచారం చేసేస్తూ ఉంటారు. అది పాలనలోనే కాదు ప్రచారంలోనూ కనిపిస్తోంది. తన అభ్యర్థులంతా పేదవాళ్లని బీద పలుకులు పలుకుతూ అభ్యర్థుల్ని పరిచయం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో అభ్యర్థుల్ని పరిచయం చేసినప్పుడు అందరూ పేదవారేనని చెప్పడంతో… ఎదుట ఉన్న వారు కూడా అవాక్కయ్యారు. బుట్టా రేణుక అయితే… స్వయంగా తాను కూడా నవ్వాపుకోలేకపోయారు. ఎందుకంటే తానెంత పేదరాలో ఆమెకు తెలుసు మరి. ఇక ఫ్యాక్షనిస్టులు.. ఊళ్లో వాళ్ల సొమ్మంతా తమదే అని బొక్కేసే నేతల్ని కూడా పేదవాళ్లగానే పరిచయం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్దాలకు ఇవి మరీ పీక్స్ కు చేరిపోవడంతో… ప్రజలు ఏమనుకుంటారో…అన్న ఇంగితం కూడా జగన్ మర్చిపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక్క మాటను కూడా ప్రజలు నమ్మలేని ప రిస్థితులు వచ్చాయి. తనకు పేపర్ లేదంటారు.. టీవీలు లేవంటారు.. ఎదుటి వారికి ఉన్నవేమీ తనకు లేవంటారు… నిజానికి ఆయన ఉన్న వేంటో కళ్ల ముందే ఉన్నాయి. అయినా ఇలా బరితెగించి ప్రజలెవరికీ నిజాలు తెలియదని అనుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ తిరగడం మాత్రం… ఆయన మానసిక స్థితిపై సందేహాలు పెరిగిపోవడానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close