ప్ర‌భాస్ ‘ఫ్రీ’గా చేస్తున్నాడా?

మంచు విష్ణు ఏం మంత్ర‌మేశాడో ఏమో, ‘క‌న్న‌ప్ప‌’ కోసం చాలామంది స్టార్ల‌ని త‌న టీమ్ లోకి తీసుకొన్నాడు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈరోజుల్లో ప్ర‌భాస్ తో సినిమాలో ఓ పాత్ర చేయించ‌డం ఏమంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అది అతిథి పాత్ర అయినా స‌రే. ఎందుకంటే ప్ర‌భాస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో మ‌రో సినిమాకు డేట్లు కేటాయించ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. అయినా స‌రే.. ‘క‌న్న‌ప్ప‌’లో ఓ కీల‌క పాత్ర చేయ‌డానికి ప్ర‌భాస్‌ముందుకొచ్చాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ పై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని పూర్తి చేశారు. ప్ర‌భాస్ పార్ట్ అయిపోయిన‌ట్టే.

అయితే ఈ సినిమా కోసం ప్ర‌భాస్ పైసా కూడా పారితోషికం తీసుకోలేదు. మోహ‌న్ బాబుపై త‌న‌కున్న గౌర‌వం, ఇష్టంతో ఈ సినిమాని ఫ్రీగా చేసిన‌ట్టు తెలుస్తోంది. మోహ‌న్‌బాబుతో ప్ర‌భాస్‌కు మంచి అనుబంధం ఉంది. ‘బుజ్జిగాడు’లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచీ.. వీరి మైత్రి బ‌ల‌ప‌డింది. మోహ‌న్ బాబు కోరిక మేర‌కు ఈ సినిమాలో న‌టించ‌డానికి ప్ర‌భాస్ ముందుకొచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా పెద‌నాన్న కృష్ణంరాజుకు ‘క‌న్న‌ప్ప‌’ ఇష్ట‌మైన స‌బ్జెక్ట్. ప్ర‌భాస్ తో ‘భ‌క్త కన్న‌ప్ప‌’ రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. పెద‌నాన్న కోరిక‌ని కొంత వ‌ర‌కూ ఈ సినిమాతో నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేశాడు ప్ర‌భాస్‌. నిజానికి ముందు ఒక స‌న్నివేశానికే ప్ర‌భాస్ పాత్ర ప‌రిమితం. కానీ… ఆ త‌ర‌వాత లెంగ్త్ పెరిగింది. అయినా సరే, ప్ర‌భాస్ త‌న కాల్షీట్లు స‌ర్దుబాటు చేశాడు.

ప్ర‌భాస్ ఒక్క‌డే కాదు, ఈ సినిమాలో అతిథి పాత్ర‌ల్లో చేయ‌డానికి ముందుకొచ్చిన చాలామంది న‌టీన‌టులు పారితోషికం గురించి ఆలోచించ‌లేదని తెలుస్తోంది. అయితే మోహ‌న్ బాబు మాత్రం `విలువైన` కానుక‌ల్ని రిట‌ర్న్ గిఫ్ట్ రూపంలో ఇవ్వ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. అక్ష‌య్ కుమార్ మాత్రం రోజువారీ పారితోషికానికే సినిమా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close