కాంగ్రెస్‌కు తప్పిన “పీకే” గండం !

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తమ ఆహ్వానాన్ని తిరస్కరించారని ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రధాన కార్యదర్శి పదవి తీసుకునేందుకు సిద్దమైన ఆయన చివరికి తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంబంధాలను వదులుకుని ఒక్క కాంగ్రెస్‌కే అంకితమయ్యేందుకు సిద్ధపడలేదు. దీంతో గౌరవంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీనే కాస్త చొరవ తీసుకుని ఆయనేపార్టీలో చేరనన్నారని ప్రకటించేసుకుంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఓపెద్ద బ్లూప్రింట్ తయారుచేసి ఇచ్చారు. తాను పార్టీలో ఉంటే చురుగ్గా అమలు చేయగలుగుతామని నమ్మకం కలిగించారు.

అయితే తన ఐ ప్యాక్ మాత్రం దేశంలో ఒప్పందం చేసుకున్న అన్ని పార్టీలకు పని చేస్తుందని ఆయన తేల్చేశారు. దీంతో పీకే కాంగ్రెస్‌లో చేరి కూడాఇతర పార్టీలకు పని చేస్తే అంత కంటే భావదారిద్ర్యం మరొకటి ఉండదని భావించారు. అదే కాంగ్రెస్‌లో రకరకాల చర్చలకు కారణం అయింది. చివరికి ఉభయతారకంగా పీకే రిపోర్టు చూసి కాంగ్రెస్‌లోకి సోనియా ఆహ్వానించారని..కానీ ఆయననేరుగా రాజకీాయాల్లోకి రాకుండా..సలహాదారుగా మాత్రమే ఉంటామన్నారని ప్రకటించారు.

ఇప్పటికైతే కాంగ్రెస్ కు పీకే గండం తప్పిపోయినట్లయింది. కాంగ్రెస్‌లో ఆఫర్‌ను తిరస్కరించేంత సీన్ పీకేకు లేదని గతంలో ఆయన జేడీయూలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.బీహార్ రాజకీయాల్లోనే ఓ చిన్న పాత్ర కోసం ఆయన సిద్ధపడ్డారు..కాంగ్రెస్‌లో ప్రధన కార్యదర్శి పదవి ఎందుకు వద్దంటారని అంటున్నారు. మొత్తంగా పీకేను కాంగ్రెస్ వదిలించుకుందో.. కాంగ్రెస్ ను పీకే వదిలించుకున్నారో కానీ ఇప్పటికే… ఈ పీకే కాంగ్రెస్ ఎపిసోడ్‌కు తెరపడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close