రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీ వియోగం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ధాంగి శ్రీమతి శుబ్రా ముఖర్జీ ఈరోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూసారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి బాధపడుతున్నారు. ఢిల్లీలో మిలిటరీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 10.51 గంటలకి మరణించారు. ఆమె 1940, సెప్టెంబర్ 17న బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న జెస్సోర్ అనే గ్రామంలో జన్మించారు. 1957, జూలై 13న ఆమెకు ప్రణబ్ ముఖర్జీతో వివాహం జరిగింది. ఆమె మంచి రచయిత. సంగీతం, చిత్రలేఖనంలో మంచి గుర్తింపు పొందారు. స్వయంగా అనేక పెయింటింగ్ ఎగ్జిబిషన్లు నిర్వహించేవారు. ఆమె గీతాంజలి ట్రూప్ పేరుతో ఒక సంగీత బృందాన్ని సమకూర్చుకొని అనేక సంగీత కచేరీలు కూడా ఇచ్చారు. ఆమె వ్రాసిన ‘చకోర్ అలోయ్’ మరియు ‘చెన అచెనై చిన్’ అనే రెండు పుస్తకాలు మంచి పేరు, రచయిత్రిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

ప్రణబ్ దంపతులకు శర్మిష్ఠ అనే ఒక కుమార్తె అభిజిత్,ఇంద్రజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో శర్మిష్ఠ ప్రముఖ కథక్ నృత్యకారిణిగా అందరికీ చిరపరిచితులు. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. ఇటీవల డిల్లీ ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసారు కాని ఓడిపోయారు. అభిజిత్ తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన జంగీ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close