నేడు పశ్చిమగోదావరి జిల్లాలో వేదపాఠశాల ప్రారంభించనున్న రాష్ట్రపతి

పచ్చిమ గోదావరి జిల్లాలోని ఐ-భీమవరం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించిన వేదపాఠశాలను నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం సుమారు 11.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టరులో 11.35 గంటలకు ఐ-భీమవరం చేరుకొంటారు. వేదపాఠశాల ప్రారంభోత్సవం చేసిన తరువాత అక్కడ జరిగే కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆ తరువాత అక్కడ ఒక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా తిరుపతి వెళతారు. రేణిగుంట విమానశ్రయంలో గవర్నర్ నరసింహన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ఆయనకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి ఆయన కారులో తిరుమల కొండమీద ఉన్న పద్మావతీ అతిధి గృహానికి చేరుకొని కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత వరాహనరసింహ స్వామి వారిని, ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొంటారు. సాయంత్రం 6.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి హైదరాబాద్ బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గన్నవరం, ఐ-భీమవరం, రేణిగుంట, తిరుమలలో కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close