మీడియా వాచ్ : జర్నలిస్టుల పరువు తీసేసిన ప్రెస్ క్లబ్ ఎన్నికలు!

హైదరాబాద్ మీడియా సర్కిల్స్‌లో ప్రెస్ క్లబ్ ఎన్నికల హడావుడి ఓ రేంజ్‌లో సాగింది. ప్యానల్స్ లక్షలు ఖర్చు పెట్టాయి. పబ్లిసిటీ కోసం ఉద్యోగాలను కూడా వారం ..పది రోజుల పాటు పక్కన పెట్టి ప్రచారం చేశారు. గత ఆదివారం ప్రెస్ క్లబ్ మొత్తం పాత జర్నలిస్టులతో కళకళలాడింది. కొత్త జర్నలిస్టుకు ఎలాగూ సభ్యత్వం ఇవ్వరు. అయితే పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ ముగిసింది..కానీ ఫలితాలు మాత్రం ప్రకటించలేదు. దీనికి కారణం… సాధారణ ఎన్నికల్లో జరగాల్సిన అవకతవకలన్నీ అక్కడ జరిగాయి. రిగ్గింగ్ జరిగింది. బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేశారు. చివరికి కేసులు కూడా పెట్టుకున్నారు.

దీంతో ఫలితం ప్రకటించకుండా వాయిదా వేసి వెళ్లిపోయారు ఎన్నికలను పర్యవేక్షించినవారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులుకూడా పోలీసుల చేతికి పోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలపై రాయమంటే కథలు.. కవితలు… వర్ణిస్తూ రాసే జర్నలిస్టు సీనియర్లు కూడాఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు . వారుకూడా ఈ అవకతవకల్లో భాగమయ్యారు. తాము ఆ తాను ముక్కలమే అని నిరూపించారు. ఎవరెవరు గెలిచారో ఓ లిస్ట్ ఇప్పటికే సర్క్యూలేట్ అవుతోంది.కానీ అధికారికప్రకటన మాత్రంలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికలు పెడతారా అన్నచర్చకూడా జరుగుతోంది. అదే జరిగితే.. ఈ సారి మరింత పరువు పోవడం ఖాయం.

ప్రెస్ క్లబ్ ఎన్నికలు జర్నలిస్టుల్లోని మరో కోణాన్ని బయటకు తెచ్చాయి. మా ఎన్నికలకుఏ మాత్రం తగ్గకుండా డ్రామా నడుస్తోంది. అయితే వారి గురించి వారు చెప్పుకోరు..రాసుకోరు కాబట్టి ఈ విషయం ఇంకాలైమ్ లైట్‌లోకి రాలేదు. ఎలా చూసినా సీనియర్ జర్నలిస్టుల .. ఎన్నికల్లో పోటీ చేసి.. తాము నిత్యం చెప్పే సూక్తులకు వ్యతిరేకంగా గూండాయిజం చేసి.. జర్నలిస్టుల పరువును సోమాజిగూడ రోడ్లపై పడేశారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close