గ‌ప్ చుప్‌గా వెబ్ సిరీస్ పూర్తి చేసేశాడు

ఈరోజుల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల‌కే బేరాలు బాగున్నాయి. ఓటీటీ ఛాన‌ళ్లు కంటెంట్ కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాయి. వాటిలో మంచి క‌థ‌లు చూడ్డానికీ స్కోప్ దొరుకుతుంది. పారితోషికాలు, బ‌డ్జెట్లూ భారీగా ఉండ‌డంతో టాప్ స్టార్స్ కూడా… వెబ్ సిరీస్‌ల‌పై మ‌క్కువ చూపిస్తున్నారు. హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి కూడా ఓ వెబ్ సిరీస్ చేసేశాడు. ‘లూజ‌ర్‌’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ప్రియ‌ద‌ర్శి, శ‌శాంక్ ప్రధాన పాత్ర‌లు పోషించారు. ఈనెల 15 నుంచి జీ 5లో ఈ వెబ్ సిరీస్‌స్ట్రీమింగ్ కానుంది. క్రీడా నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ… ఈ ‘లూజ‌ర్‌’.

ఆటంటేప్రాణాలు పెట్టుకునే ముగ్గురి క‌థ‌. ఒక‌రు షూటింగ్‌లో, ఇంకొక‌రు క్రికెట్‌లో, మ‌రొక‌రు బ్యాట్మెంటెన్‌లో దిట్ట‌. కెరీర్‌లో వాళ్ల‌కు ఎలాంటి ఆటు పోట్లు ఎదుర‌య్యాయి? క్రీడ‌ల్లో ఉన్న రాజ‌కీయాలేంటి? వాటిని దాటుకుంటూ ఈ ముగ్గురూ ముందుకు ఎలా వెళ్లారు? అనేదే క‌థ‌. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ గ‌ప్ చుప్‌గా పూర్త‌య్యింది. ఇందులో క‌నిపించిన‌వాళ్లంతా దాదాపుగా సినీ నేప‌థ్యం ఉన్న‌వాళ్లే. ప్ర‌మోష‌న్లు కూడా ఈమ‌ధ్యే మొద‌లెట్టారు. తెలుగులో చాలా వెబ్ సిరీస్‌లు వ‌చ్చినా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాత్రం ఇంత వ‌ర‌కూ రాలేదు. మ‌రి.. ఈ `లూజ‌ర్‌` ఎలా ఉంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close