జయలలితపై తెలుగు సినీ నిర్మాత పోటీ

తెలుగు సినీ నిర్మాత, తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాను తమిళనాడు ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలితపై పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆమె పోటీ చేస్తున్న రాధాకృష్ణ నగర్ నియోజక వర్గంతో బాటు రాష్ట్రంలో తెలుగువారు అధికంగా స్థిరపడిన హోసూరు నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్నాడిఎంకె ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రంలో తెలుగుబాష కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, తెలుగువారిని ఏమాత్రం గౌరవించడం లేదని, అందుకే తెలుగువాళ్ళ తరపున తను ఆమెపై పోటీకి దిగవలసి వస్తోందని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికలలో తను గెలిస్తే తెలుగువారికి జరుగుతున్న అన్యాయం గురించి శాసనసభలో తెలుగువారి తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరులో పర్యటిస్తున్నపుడు జగదీశ్వర్ రెడ్డి వెళ్లి ఆయనని కలిసి, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తెదేపా పోటీ చేయాలని కోరారు కానీ చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కనుక తనే పోటీకి సిద్దమయ్యారు. అయితే జయలలితను డ్డీకొని గెలవడం అసాధ్యం అని ఆయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే హోసూరు నుంచి కూడా పోటీ చేస్తున్నట్లున్నారు. ఒకవేళ హోసూరు నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టినా, ఆయన గొంతు వినిపించనిస్తారా?అంటే అనుమానమే. ఎందుకంటే అన్నాడిఎంకె పార్టీలో కూడా ఇద్దరు తెలుగువాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగు పాటశాలలను ఒకటొకటిగా మూసేస్తున్నా, తెలుగు అధ్యాపకులను, విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నా వారిద్దరూ ఏనాడూ కూడా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. జాతీయ పార్టీగా అవతరించాలనుకొన్న తెదేపాకి ఈ ఎన్నికలు చాలా మంచి అవకాశం కల్పించినప్పటికీ దానిని వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు…ఎందుకో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close