వారు విద్యార్ధులు..ఉగ్రవాదులు కాదు: ప్రొఫెస్సర్ కంచె ఇలయ్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులలో కులోన్మాధం, అతివాదం, జాతి వ్యతిరేకత వంటి అవలక్షణాలు పెరిగిపోతున్నాయని, కనుక తక్షణమే కలుగజేసుకొని యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దామని కోరుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకి లేఖ వ్రాసారు. దానిపై తీవ్రంగా స్పందించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సదరు విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించడంతో అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి చెందిన ఐదుగురు విద్యార్ధులను యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేయబడ్డారు. ఆ కారణంగానే రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడని స్పష్టం అవుతోంది.

రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఈ పరిణామాలను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య చాలా ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీలో విద్యార్ధులు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు అన్నట్లుగా బండారు దత్తాత్రేయ కేంద్రానికి లేఖ వ్రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. వారి వద్ద తుపాకులు, బాంబులు వంటివేవయినా దొరికాయా? చదువుకోవడానికి వచ్చిన విద్యార్ధులను పట్టుకొని వారు ఉగ్రవాదులు.. దేశాద్రోహులో అన్నట్లు లేఖ వ్రాయడం ఏమిటి? అని ప్రశ్నించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలంటే బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లకు ఎప్పుడూ చులకనే అని అన్నారు. ఆ చులకన భావమే బండారు దత్తాత్రేయ లేఖలో కనిపిస్తోందని అన్నారు. దేశంలో చాలా యూనివర్సిటీలలో అగ్రకులాల పెత్తనం కొనసాగుతోందని వారిని ఎదిరించే ప్రయత్నం చేసినవారిని ఈ విధంగానే అణచివేయబడుతున్నారని ఐలయ్య అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close