ఏపీ సర్కార్ తప్పు – కేంద్రం చేతుల్లోకి ప్రాజెక్టులు !

నాగార్జునసాగర్‌ డ్యామ్‌, శ్రీశైలం డ్యామ్‌ల అప్పగింత వివాదం కొనసాగుతుండగానే కేంద్ర జలశక్తి శాఖ మరో ముందడుగేసింది. ఒకటో తేదీన ప్రాజెక్టుల అప్పగింత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేఆర్‌ఎంబీ చైర్మెన్‌, ఇతర ఉన్నతాధికారులు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీల మధ్య చర్చలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున ఏపీ సర్కారు నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై ఉన్న దాదాపు 13 గేట్లను మా నీళ్లను మేమే తీసుకుంటామంటూ పోలీసులతో ఆక్రమించింది. అప్పట్లో తెలంగాణ ఆ చర్యను ఖండించింది. కేంద్ర జలశక్తి శాఖ సైతం ఏపీ చర్యను ప్రశ్నించింది.

పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ సీఆర్‌పీఎఫ్‌ దళాలను పెట్రోలింగ్‌ కోసం ఏర్పాటు చేసింది. ఈ చర్య మూలంగా నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నిర్వహణపై తెలంగాణ సర్కారుకు ఉన్న ప్రస్తుత అధికారం ప్రశ్నార్థకమవుతున్నది. సాగర్‌తోపాటు శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ కూడా కేఆర్‌ఎంబీ చేతుల్లో పెట్టేందుకే కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఈఎన్సీల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులపై పెత్తనం చేసేందుకే కేంద్రం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. డ్యామ్‌ల అప్పగింతతో పాటు మరో 15 అంశాలపై చర్చించి యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు చెందిన ఇంజినీర్లు నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను సందర్శించాలంటే కచ్చితంగా కేఆర్‌ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డ్యామ్‌కు ఏవైనా తప్పనిసరి మరమ్మతు పనులు చేయాలన్నా కేఆర్‌ఎంబీ అంగీకరించాల్సిందే. రాజకీయ లాభం కోసం ఏపీ చేసిన వ్యవహారంతో రెండు రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close