పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్… పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే సిద్ధూ పార్టీని సర్వం భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆ పదవి కూడా తనకు వద్దని రాజీనామా చేసేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయిన సిద్దూ తనకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.

దానికి సీఎం అమరీందర్ సింగ్ అంగీకరించలేదు. అసంతృప్తి కార్యకలాపాలు చేసి చేసి చివరికి పంతం నెగ్గించుకున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఓపిక పట్టి ఉంటే ఆయన నేతృత‌వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉంటే సీఎంపదవి ఆయనకే దక్కేది. అమరీందర్‌కు అప్పటికే పార్టీలో మద్దతు తగ్గిపోయింది. అయితే కారణం ఏదైనా కానీ అమరీందర్ రాజీనామా చేసేవరకూ తగ్గలేదు. చివరికి దళిత నేతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అయినా పరిస్థితులు సద్దు మణగలేదు. కెప్టెన్ అమరీందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన అమిత్ షా అపాయింట్ మెంట్ తీసుకున్నారు.

దీంతో మరోసారి కలకలం రేగింది. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సిద్ధూ ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితికి కాంగ్రెస్ హైకమాండ్ చేరిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close