ఏపీలో టీడీపీతో పొత్తులపై పురందేశ్వరికి ఇంకా హోప్స్ !

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయని.. టీడీపీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ప్రభుత్వంపై ఎప్పట్లాగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో కలిసి వెళ్తామని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. జనేసన పార్టీ మాత్రం ఇప్పటికే టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుంది. నియోజకవర్గ స్థాయి వరకూ సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రెండు పార్టీల నేతలు కలిసి పని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా బీజేపీని కలుపుకుని పోవాలని అనుకోవడం లేదు. బీజేపీ గురించి పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఎక్కడ వైసీపీ చీఫ్ ల కేసులు కదులుతాయోనని ఆ పార్టీ సానుభూతిపరులు కొంత మంది అడ్డం పడుతున్నారు. పొత్తులు వద్దే వద్దని అంటున్నారు. కానీ పురందేశ్వరి మాత్రం పొత్తులు ఖాయమనుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. మొదట జనసేన ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంది. కానీ తర్వాత బీజేపీతో పొత్తుల ప్రతిపాదనలు రావడంతో అంగీకరిచింది. మొత్తంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ అయితే చేస్తున్నారు కానీ.. ప్రచారాలు చేయడం లేదు.

అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ పొత్తుల అంశంపై బీజేపీ వైపు నుంచి కొన్ని చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉండే అవకాశం ఉండటంతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ టీడీపీతో కలవాలంటే.. బీజేపీ వైపు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా చాలా ఎక్స్ ట్రీమ్ నిర్ణయాలను టీడీపీ ఎక్స్ పెక్ట్ చేస్తుంది. అలా జరిగితేనే పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

కొత్త కొత్త హామీలతో బీఆర్ఎస్ ప్రయత్నాలు

బీఆర్ఎస్ ప్రజల్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో లేని హామీలు ఇస్తోంది. వివిధ వర్గాలతో సమావేశమై.. వారికి హామీలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్యాసింజర్ ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close