‘భీమ్లా’ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌పై ‘పుష్ఫ’ ఎఫెక్ట్

ఈరోజు హైద‌రాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌ లో `భీమ్లా నాయ‌క్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం జ‌ర‌గాల్సిన వేడుక ఇది.ఏపీ మంత్రి చ‌నిపోవ‌డంతో.. వాయిదా వేయాల్సివ‌చ్చింది. ఈ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌పై.. పుష్ప‌ ఎఫెక్ట్ భారీగా ప‌డింది.

పుష్ప ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇదే ఆవ‌ర‌ణ‌లో జ‌రిగింది. అనుమ‌తికి మించి పాస్‌లు జారీ చేయ‌డం వ‌ల్ల‌… క్రౌడ్ ఎక్కువ వ‌చ్చేసింది. వాళ్ల‌ని అదుపు చేయ‌డం చాలా క‌ష్ట‌మైంది. దాంతో తోపులాట జ‌రిగింది. కొంత‌మంది అభిమానులు గాయ ప‌డ్డారు. చాలామంది బ‌య‌టే ఉండిపోవాల్సివ‌చ్చింది. అలాంటి త‌ప్పులు ఈ `భీమ్లా…` విష‌యంలో జ‌ర‌క్కూడ‌ద‌ని పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. అందుకే పాసుల ముద్ర‌ణ బాధ్య‌త పోలీస్ శాఖ తీసుకుంది. సోమ‌వారం నాటి ఈవెంట్ కి ఇది వ‌ర‌కే చిత్ర‌బృందం పాస్‌లు పంపిణీ చేసేసింది. ఇప్పుడు అవి చెల్ల‌వు. కేవ‌లం పోలీస్ శాఖ పాసులు ఉంటే త‌ప్ప‌, అనుమ‌తి లేదు. సాధార‌ణంగా 5 వేల కెపాసిటీ అనుకుంటే, 10 వేల పాసులు ముద్రించి, పంపిణీ చేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం అలా జ‌ర‌గ‌డం లేదు. స‌రిగ్గా 5 వేల పాసులు మాత్ర‌మే ప్రింట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి టీవీ ఛాన‌ళ్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. హారిక హాసిని యూ ట్యూబ్ ద్వారా మాత్ర‌మే లైవ్ చూసేలా ఏర్పాటు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close