ఇవెక్కడి విశ్వసనీయ వర్గాలండీ : పాఠకుల ప్రశ్నలు

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దాదాపు గంటన్నర సమావేశమయ్యారు.

ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా అరగంట మాట్లాడుకున్నారు” ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియాలో బ్రేకింగ్ న్యూస్ “ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాలు సమావేశమయ్యారు. మీ పని తీరు పట్ల వ్యతిరేకత వస్తోంది. పద్దతి మార్చుకోండి అని ప్రధాని నరేంద్రమోడీ సీఎం జగన్ కు హితవు పలికారు”
ఇది చంద్రబాబు నాయుడి అనుకూల మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్.

ఈ రెండు బ్రేకింగ్ న్యూస్ లు వస్తున్న సమయంలో పిఎం, సీఎంల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఏం జరుగుతోందనని ఇళ్లలో కూర్చుని టీవీలు చూస్తున్న వారికి ఈ రెండు మీడియాల్లో వచ్చిన వేర్వేరు బ్రేకింగ్ న్యూస్ లు ఆందోళక కలిగించడమే కాదు ఆగ్రహం కూడా తెప్పించాయి. ప్రధానితో సమావేశమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించి ఉండవచ్చునని, దీనికి ప్రధాని స్పందన ఎలా ఉంటుందోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే, టీవీల్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ లు వీక్షకులు, పాఠకులకు నిరాశ కలిగించాయి. కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మాత్రమే ఏకాంతంగా సమావేశమైతే వారిద్దరూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో మీడియాకు ఎలా తెలిసిందని జట్టు పీక్కున్పారు. సమావేశ మందిరంలో ఈ విశ్వసనీయ వర్గాలనేవి ఎక్కడ ఉంటాయో… వారి రూపురేఖ విలాసాలు ఎలా ఉంటాయో తెలియక తలలు పట్టుకున్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రం బాగోగుల గురించి ప్రధానితో చర్చించడం వ్యక్తిగతం వ్యవహారం కాదని, ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ అని మీడియాకు తెలియదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల ఏకాంత సమావేశం వివరాలు వారిద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాల్సి ఉంటుందని, వారిద్దరు ఎవరితోనూ ఏదీ మాట్లాడకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోతే ఈ విశ్వసనీయ వర్గాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇలాంటి బ్రేకింగ్ లతో మీడియా ఏం సాధిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొనమెరపు : సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. వారిద్దరి సమావేశం ముగిసిన తర్వాత బిల్ క్లింటన్ హైదరాబాద్ లోని అమెరికా కౌన్సలైట్ తో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఆ మర్నాడు అత్యధిక సర్కులేషన్ గల పత్రిక పతాక శీర్షికల్లో రాసింది. ఈ వార్త చదివిన ఆ మీడియా చైర్మన్ వార్త రాసిన విలేకరిని పిలిచి “నీకు క్లింటన్ తో కాని, కౌన్సిలైట్ తో కాని అంత పరిచయం ఉందా. నాకు అమెరికాలో చిన్న పని ఉంది చేసి పెడతావా ” అని అడిగారట. ఆ తర్వాత ఏకాంత సమావేశాలను విశ్వసనీయ వర్గాల పేరుతో రాయకండి అని చివాట్లు కూడా పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close