‘చంద్రబాబు విఫలమవుతున్నాడని వేమూరి రాధాకృష్ణకు ఆక్రోశం’

హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికపై – ‘అక్కడేదో తేడాగా ఉంది’ అంటూ ఆంధ్రజ్యోతి కథనం ఇవ్వటంపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్‌లో టీఆర్ఎస్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు మతి పోయిందని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మానసిక ఆరోగ్యంలో తేడా వచ్చినందువల్లే తేడాగా ఉంది అంటూ కథనాలు ఇస్తున్నాడని ఆరోపించారు.

వరంగల్ టీఆర్ఎస్‌లో నిరసన సెగలున్నాయని, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు. మంత్రులు ప్రచారానికి ఎటు వెళ్ళినా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని, ఓటర్లు నిలదీస్తున్నారని రాశారు. దీనిపై జగదీశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అది కట్టు కథ అని, వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు లభిస్తున్న ఆదరణ చూసి రాధాకృష్ణకు మతి పోయిందని అన్నారు. మంత్రులను ఓటర్లు నిలదీయటం సహజమేనని, తమ దగ్గరకు వచ్చిన మంత్రులను ప్రజలు సమస్యల గురించి అడుగుతూ ఉంటారని జగదీశ్వర్ చెప్పారు. రాధాకృష్ణకు తెలంగాణ ప్రజలంటే ద్వేషమని ఆరోపించారు. పక్కరాష్ట్రంలోని వారికి ఇష్టమైన నాయకుడు, ముఖ్యమంత్రి విఫలమవుతున్నాడన్న బాధతో రాధాకృష్ణ ఈ కథనాలు రాయిస్తున్నాడని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక ఏకపక్షంగా తమవైపే ఉందని చెప్పారు. రాధాకృష్ణ తెలంగాణ ద్రోహి అని, దొంగ అని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close