తీర్పులు ముందే చెబుతున్న సాక్షిపై కోర్టులో పిటిషన్ : రఘురామ

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేసిందంటూ సాక్షి మీడియా చేసిన ప్రచారంపై కోర్టులో పిటిషన్ వేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు నిర్ణయించుకున్నారు. కోర్టులు తీర్పులు చెప్పకుండానే సాక్షి మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర ఉందని తక్షణం విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. ఈ అంశంపై గురువారం కూడా మాట్లాడారు. న్యాయమూర్తి దృష్టికి తీర్పు ప్రకటించిన అంశాన్ని తీసుకెళ్లానని చెప్పారు. ఈ రోజు పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పడం వైసీపీ వర్గాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆయన దాఖలు చేసిన పిటిషన్లు వైసీపీ నేతలకు లేని పోని టెన్షన్లు తెచ్చి పెడుతున్నాయి.

విదేశాలకు వెళ్తున్న విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి వస్తారో లేదోనన్న అనుమానాలను రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నేతలు, జగన్ మీడియా రఘురామ కృష్ణరాజు విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోతున్నారని ప్రచారం చేశారు. ఈ కారణంగా ఆయన గతంలో విదేశీ పర్యటనను కూడారద్దు చేసుకున్నారు. గతంలో తాను విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని ఇప్పుడు ఎవరు విదేశాలకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి వస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూ… వారి మనసులో ఉన్న విషయాలను అందరికీ ఆపాదిస్తున్నారని విమర్శించారు.

విశాఖపట్నంలో తీర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలో విదేశాల్లో పరిశీలించి వస్తాననిచెప్పి విదేశీ పర్యటనకు విజయసాయిరెడ్డి అనుమతి తీసుకోవడంపై వైఎస్ఆర్ అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదన్నారు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గతంలో తనపై చేసిన ప్రచారానికి ఇప్పుడు కౌంటర్లు ఇస్తూ విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి రారనే అర్థంలో రఘురామ ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close