మోడీకి నర్సాపురం ఎంపీ పొగడ్తలు వయా ఆంధ్రజ్యోతి..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీపై తన భక్తిని ఆరాధన స్థాయికి తీసుకు వెళ్తున్నారు. వైసీపీలోఇమడలేనని నిర్ణయించుకున్న ఆయన.. మెల్లగా.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఆపార్టీపై విమర్శలు.. పథకాల్లో లోపాలను వెల్లడిస్తూ..దూరం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన పదవి ఊడగొట్టాలని… వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రయత్నాలకు కౌంటర్‌గా రఘురామకృష్ణంరాజు.. ఈసీతో పాటు.. న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించారు. ఆ రెండే సరిపోవు.. అన్నింటి కన్నా సూపర్ పవర్‌ను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే.. ఆయన ప్రధాని నరేంద్రమోడీని ఓ రేంజ్‌లో పొగడటం ప్రారంభించారు. రెండు సార్లు పాటలు రిలీజ్ చేసిన ఆయన.. పలుమార్లు… మోడీ నిర్ణయాలను ప్రశంసిస్తూ లేఖలు రాశారు. తాజాగా.. పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో కథనాలు కూడా రాస్తున్నారు.

ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు.. మోడీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూ.. రఘురామకృష్ణంరాజు.. ఓ ఆర్టికల్ రాసేశారు. ఆత్మరక్షణలో చైనా అనే హెడ్ లైన్ పెట్టారు. ఫోటో వేసి మరీ.. రఘురామకృష్ణంరాజు రాశారని.. ఆంధ్రజ్యోతి కూడా గుర్తింపు నిచ్చింది. గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గి.. చైనా వైపు వెళ్లడమే.. ఈ ఆర్టికల్ వెనుక ఉన్న కారణం. అలా బ్రేకింగ్ న్యూస్ రాగానే ఇలా మోడీకి క్రెడిట్ కట్ట బెట్టేసి.. వీరుడు..శూరుడు అని.. రఘురామకృష్ణంరాజు పొడిగేశారు. ఆయన లద్దాఖ్‌లోని నీము ప్రాంతాన్ని సందర్శించి.. చైనాకు వార్నింగ్ ఇచ్చారని.. అది బాగా పని చేసిందని… తన ఆర్టికల్ అర్థంగా.. ఎంపీ చెప్పుకొచ్చారు.

వైసీపీతో తగవులు పెట్టుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఆయనకు మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తోంది. టీవీ9, ఎన్టీవీ లాంటి .. ఏపీ అధికార పార్టీకి దగ్గరగా ఉండే చానళ్లు కూడా.. ఈ ఆర్ఆర్ఆర్‌కు కవరేజ్ ఇస్తున్నాయి. అయితే ఆ చానళ్ల దృక్కోణం వేరు. ఆయనతో వైసీపీకి రాజీ చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ.. టీడీపీ మద్దతు చానళ్లు అని ప్రచారం పొందినవి మాత్రం ఆయన మాటలను మరింత వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు.. ఆయన మోడీకి వేస్తున్న పొగడ్తల మాలకూ సహకరిస్తున్నాయి. ఆయన రాజకీయ జీవితం భద్రంగా ఉండేలా… తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close