బెయిల్ రద్దయ్యేలా చేసుకుంటున్న రఘురామ !

రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దయ్యేలా చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌లో విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చారు. సోమవారం హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్‌కురావాలని చెప్పారు. రఘురామ విచారణకు హాజరవుతారన్న ఉద్దేశంతో సీఐడీ అధికారుల బృందం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగామకు చెందిన డిప్యూటీ తహసీల్దార్, వైద్యుడు, మరో మధ్యవర్తిని కూడా ఏపీ సీఐడీ పోలీసులు సిద్ధం చేశారు.

రఘురామ తరపున కూడా కొంత మంది వచ్చారు. రఘురామకు గుండెకు సంబంధించిన సమస్య ఉండటంతో ఆయన తరపున ఓ వైద్యుడు కూడా వచ్చారు. అయితే చివరికి తాను రావడం లేదని రఘురామ సమాచారం ఇచ్చారు. అయితే అదే సమయంలో ఢిల్లీలో తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు.

హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని.. తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు. మరి ఆయన రానని చెబితే సీఐడీ అధికారులు హైదరాబాద్ ఎందుకు వచ్చారన్నది సందేహంగా మారింది. ఆయన బెయల్ షరతులు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లడానికే సీఐడీ అధికారులు ఇలా చేశారని.. ఆయన బెయిల్ రద్దు చేయాలని వారు ఈ కారణంగా చూపి హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close