తెలంగాణకు రాహుల్ వచ్చే రోజే అమిత్ షా కూడా..!

తెలంగాణపై జాతీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నెల పదిహేడో తేదీన తెలంగాణకు వస్తారని వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతకు ముందే ప్రకటించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ ఈ విషయాన్నిగాంధీ భవన్‌లో ప్రకటించారు. రాహుల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ టీమ్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైప రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలి సారిగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నందున బలప్రదర్శన తరహాలో సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు.

అయితే అదే రోజు తెలంగాణ విమోచన దినం కూడా. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఆ రోజున అమిత్ షా ను తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు. ఆయన కూడా రావడానికి సిద్ధమయ్యారు. నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ సభకు ఏర్పాట్లు ప్రారంభించారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్‌ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజాకార్లు ఊచకోత కోశారని అందుకే అక్కడ సభ పెడుతున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఒకే రోజు తెలంగాణ పర్యటన పెట్టుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. టీఆర్ఎస్‌తో పోటీ పడేది మేమంటే మేమని రెండు పార్టీలు పోట్లాడుకుంటున్న వేళ… బల ప్రదర్శనలో రెండు పార్టీలు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని చెబుతోంది. దీనిపై రెండు పార్టీలూ టార్గెట్ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close