నిపుణులతో కేంద్రానికి సలహాలిప్పిస్తున్న రాహుల్ గాంధీ..!

దేశం ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు వైరస్ విజృంభణ.. మరో వైపు.. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవడంతో.. భవిష్యత్ గందరగోళంగా ఉంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ తెలివైన రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. దానికి నేషనలిజం ముసుగును బీజేపీ నేతలు తొడుగుతూండటంతో భిన్నమార్గంలో సలహాలు… సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జర్నలిస్ట్ అవతారం ఎత్తారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై… ముఖాముఖి మాట్లాడారు . దాన్ని అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు మీడియాకూ ఇచ్చారు.

రఘురాంరాజన్ కు … భారత్ ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితుల్లో చక్కదిద్దిన ఆర్బీఐ గవర్నర్‌గా పేరు ఉంది. ఆయన సలహాలు ఎంతో విలువైనవిగా భావిస్తూంటారు. రాహుల్ గాంధీ ఆయనతో జరిగిన ముఖాముఖిలో.. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కార మార్గాలను రాబట్టారు. వాటిని హైలెటయ్యేలా చేశారు. భారత్ లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంలో అత్యంత తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన పేదల్ని ఆదుకోవడానికి రూ. 65వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని రఘురాం రాజన్ విశ్లేషించారు. వ్యాపారాలు, కార్యాలయాలు ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని రాజన్ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ చాలా ముఖ్యమన్నారు.

రఘురాం రాజన్ ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ఆర్థిక వేత్తల్లో ఒకరు. దేశం కోసం తాను సలహాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని గతంలోనే ప్రకటించారు. అయితే.. బీజేపీ పెద్దలు ఆయన పట్ల సదభిప్రాయంతో లేరు. అందుకే.. ఆర్బీఐగవర్నర్ గా ఆయన పదవీ కాలన్ని పొడిగించలేదు. అందుకే రాహుల్ గాంధీ తెలివిగా.. ముఖాముఖి నిర్వహించి ఆయన సలహాలను కేంద్ర ప్రభుత్వానికిచేరేలా చేశారు. రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం… భారత కార్పొరేట్ సంస్థలు బలహీనపడ్డాయని.. వాటిని విదేశీ సంస్థలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది నిజమేననుకున్న కేంద్రం.. వెంటనే చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.వలస కూలీల విషయంలోనూ రాహుల్ చెప్పిన సూచలను కేంద్రం పాటించింది. రాహుల్ గాంధీ..ఈ ముఖాముఖిలను మరిన్ని విభిన్న రంగాల నిపుణులతో నిర్వహించి.. కేంద్రానికి సలహాలివ్వాలని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close