ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డైలాగ్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ద విమానాలను కోల్పోయిందో లెక్క చెప్పాలని కేంద్రాన్ని డిమండ్ చేయడం పట్ల ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కోన్నారు. భారత్ ఒకవేళ నష్టపోయినా ఆ వివరాలను చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటిని బయటపెడితే దాయాది దేశాన్ని సంతృప్తి పరచడమే అవుతుంది. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనిది కాదు. దీంతో పాక్ కు హైప్ క్రియేట్ చేసేలా రాహుల్ అలా మాట్లాడారని బీజేపీ ఎదురుదాడి చేపట్టింది.
రాజకీయం చేయాలి కానీ, అత్యంత సున్నితమైన రాజకీయాలు చేయకూడదు అంటూ రాహుల్ వైఖరిని తూర్పారబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపేలా మారాయి. భారత త్రివిధ దళాల పరాక్రమాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి అని వాదనలు వినిపించాయి. భారత్ యుద్ద విమానాలను ఎన్ని కోల్పోయిందో లెక్క చెప్పాలి అనే అంశాలను కాంగ్రెస్ అగ్రనేతగా రాహుల్ హైలెట్ చేయకుండా ఉంటే బాగుడెందన్న అభిప్రాయం కాంగ్రెస్ లోనూ వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి అసలు విషయం అర్థమైందో ఏమో ,భోపాల్ లో జరిగిన సభలో స్పీచ్ మార్చేశారు.
భారత్ కోల్పోయిన యుద్ద విమానాల లెక్క కాకుండా.. కాల్పుల విరమణపై ప్రధాని మోడీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పగానే కాల్పుల విరమణకు మోడీ అంగీకరిస్తారా.. ఇది భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమే అంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ఈ వ్యాఖ్యలు గతంలో చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకుగాను చేసినట్లుగా ఉన్నట్టు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, భారత్ – పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పారు..కానీ, భారత విదేశాంగ శాఖ ఈ వాదనను ఖండించింది.. కాల్పుల విరమణ పాకిస్తాన్ DGMO యొక్క అభ్యర్థన మేరకు జరిగిందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.