ఉ.. ఊహూ..! అందరిదీ ఓ బాధ అయితే రాజాసింగ్‌ది మరోకటి..!

పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ విషయంలో మగవాళ్లను కించ పరిచారంటూ పనిలేని కొంత మంది మేధావులు మీడియా, సోషల్ మీడిాయలో చర్చ పెట్టి.. తమనే అన్నారని తెగ బాధపడిపోతున్నారు. వారి బాధను “వ్యూ”స్‌గా మార్చుకోవడానికి కొంత మంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ పాటపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కొత్త వాదన తీసుకు వచ్చారు. అందరూ ఆ పాటలో మగవాళ్లను కించ పరిచారని అంటూంటే.. ఆయన మాత్రం దేవడ్ని కించ పరిచారని ఆరోపిస్తున్నారు.

అంతటితో వదిలి పెట్టలేదు. నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను.. ఐటమ్ సాంగ్ తరహాలో రాశారని.. వెంటనే మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ వ్యహారాల శైలితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో లేఖలో వివరించారు.

దీంతో సమంత ఐటమ్ సాంగ్‌కు ఇప్పుడు మరో తరహా పబ్లిసిటీ రావడం ఖాయమైపోయింది. హిందూ యాంగిల్‌ను జోడించడంతో మరింత రచ్చ జరగొచ్చు. ఇటీవల దేవీ శ్రీప్రసాద్ తన దృష్టిలో దేవుడి పాటలు.. ఐటం సాంగ్స్ వేర్వేరు కాదంటూ చెప్పుకొచ్చి కలకలం రేపారు. ఇప్పుడు రాజాసింగ్ఈ వివాదాన్ని అందుకున్నారు. ఇలాంటి వాటితో రాజకీయం చేయడం రాజాసింగ్ స్టైల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close