డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి ‘డైరెక్ట‌ర్స్ డే’ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది హీరోలు ఈ కార్య‌క్ర‌మానికి త‌మ వంతు స‌హాయంగా విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు వేదిక‌పై.. ద‌ర్శ‌కులంతా క‌లిసి స్కిట్లు వేయ‌డానికి, డాన్స్ షోలు చేయ‌డానికి రిహార్స‌ల్స్ కూడా మొద‌లెట్టేశారు.

మ‌న ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి మంచి డాన్స‌ర్‌. ఆయ‌న ఈ స్టేజీపై డాన్స్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు..రాజ‌మౌళి కూడా స్టెప్పేయ్య‌బోతున్నార్ట‌. ఇటీవ‌ల రాజ‌మౌళి, రమా క‌లిసి ఓ పాట‌కు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఆ స్ఫూర్తితోనే డైరెక్ట‌ర్స్ డేలో.. రాజ‌మౌళి మ‌రో పాట‌కు డాన్స్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, మోహ‌న్ బాబు ముఖ్య అతిథులుగా హాజ‌రు కాబోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది ప్ర‌ముఖుల్ని ఆహ్వానించారు. అయితే వాళ్లు ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తారా, రారా? అనేది తెలియాల్సివుంది. ద‌ర్శ‌కులంతా క‌లిసి ఓ కార్య‌క్ర‌మం చేయ‌డం.. అందులో హీరోలూ పాలుపంచుకోవ‌డం మంచి ఆలోచ‌నే. ద‌ర్శ‌కుల‌లో ఉన్న ర‌క‌ర‌కాల ప్ర‌తిభ‌ల‌న్నీ ఈ షోలో ప్రేక్ష‌కులు చూసే వీలుంది. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ షో ద్వారా వ‌చ్చే ఆదాయంతో ద‌ర్శ‌కుల కోసం, వాళ్ల సంక్షేమం కోసం వాడాల‌ని చిత్ర‌సీమ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close