పారితోషికంతో భ‌య‌పెట్టిన రాజ‌శేఖ‌ర్‌

గోపీచంద్ – శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకున్నారు. నిజానికి ఈ క్యారెక్ట‌ర్ కోసం ముందుగా రాజ‌శేఖ‌ర్ ని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. ఆయ‌న కి కూడా ఈ క్యారెక్ట‌ర్ న‌చ్చి ఓకే చెప్పాడు. కానీ పారితోషికం ద‌గ్గ‌రే పేచీ వ‌చ్చింది. ఈ క్యారెక్ట‌ర్ కోసం రాజ‌శేఖ‌ర్ రూ.5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సోలో హీరోగా గా ఎంచుకున్నా రాజ‌శేఖ‌ర్ కి అంత ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు. చిత్ర‌బృందం రూ.4 కోట్ల వ‌ర‌కూ బేరం ఆడిన‌ట్టు టాక్‌. కానీ రాజ‌శేఖ‌ర్ కింద‌కి దిగ‌క‌పోవ‌డంతో… నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గి జ‌గ‌ప‌తిబాబుతోస‌ర్దుకుపోయారు.

గోపీచంద్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ అన‌డం కంటే, గోపీచంద్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ అంటే కాస్త క్రేజ్ వ‌చ్చేది. అందుకే నిర్మాత‌లు సైతం 4 కోట్ల వ‌ర‌కూ భ‌రించ‌డానికి రెడీ అయ్యారు. కానీ.. ఒక కోటి ద‌గ్గ‌ర లెక్క మారిపోయింది. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా ఒప్పుకోవ‌డం వ‌ల్ల‌… క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమాకి వ‌చ్చే ప్ల‌స్ పాయింట్స్ ఏమీ ఉండ‌వు. గోపీచంద్ మార్కెట్ ఎంత ఉందో, అంత‌కే ఈ సినిమా అమ్ముడుపోతుంది. కానీ ప్రేక్ష‌కుల్లో కాస్త ఆసక్తి ఏర్ప‌డుతుంది. అందుకే.. నిర్మాత‌లు చివ‌రి నిమిషం వ‌ర‌కూ రాజ‌శేఖ‌ర్ నే ఎంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదు. నిజానికి ఇలాంటి ఆఫ‌ర్లు రాజ‌శేఖ‌ర్‌కి ఇది వ‌ర‌కూ వ‌చ్చాయి. కానీ ఏదో ఓ కార‌ణంతో ఆయా ఆఫ‌ర్ల‌ని ఆయ‌న వ‌ద‌లుకున్నారు. నిజంగా రాజ‌శేఖ‌ర్‌కి పారితోషికం న‌చ్చ‌క ఆయా సినిమాలు చేయ‌డం లేదా? లేదంటే `నో` చెప్ప‌డం ఇష్టం లేక‌.. ఇలా పారితోషికం వంక పెడుతున్నారా? అనేది సందేహంగా మారిందప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close