టాలీవుడ్ పెద్దల్ని నిద్రలేపుతున్న ఆర్జీవీ ! మేలుకుంటారా ? లేదా ?

తెలుగు చిత్ర పరిశ్రమను దారణంగా దెబ్బకొట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది బహిరంగ రహస్యం. ఆ విషయం సినీ ప్రముఖులందరికీ తెలుసు. ఆ ఇండస్ట్రీపై ఆధారపడిన వారందరి ఉపాధి ఎలా పోయినా ప్రభుత్వం కొంత మంది ఆర్థిక పతనాన్ని చూడాలనుకుంటోంది. అందుకే పేదలకు చవకైనా వినోదం అంటూ అడ్డగోలు కబుర్లు చెప్పి తాను చేయాలనుకుంటున్నది చేస్తోంది. మరి తమ బతుకుపై దెబ్బకొడుతున్నట్లుగా తెలిసినా ఇండస్ట్రీ ఎందుకు నోర్మూసుకుంటోంది ? ఎందుకు నోరు తెరవం లేదు ? చివరికి ఆర్జీవీ కూడా హెచ్చరించాల్సి వచ్చిందా ?

టాలీవుడ్‌ను పాతిపెట్టే ప్రయత్నం జరుగుతున్నా స్పందించలేకపోతున్న టాలీవుడ్ పెద్దలు!

టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భయపడుతుందో లేదో కానీ వివాదాన్ని పెద్దది చేసుకోవడం కన్నా వీలైనంత సాఫ్ట్‌గా పరిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తోంది. ముల్లు వెళ్లి ఆకు మీద పడినా… ఆకు వెళ్లి ముల్లు మీద పడినా చినిగేది ఆకే అనే సామెతలో ఆకు సినీపరిశ్రమే అవుతుంది. అందుకే వీలైనంత సంయమనం పాటిస్తున్నారు. కానీ అటు వైపు ఉద్దేశం స్పష్టంగా తెలిసిన తర్వాత తమను తాము కాపాడుకునే ప్రయత్నంచేయకపోతే …, జరిగేది నష్టమే కానీ… మరొకటి కాదు., ఈ విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకూ క్లారిటీ వచ్చింది. అందుకే ఆయన ఇప్పుడు నోరు తెరవకపోతే ఇంకెప్పుడూ తెరవలేరు.. ఆ తర్వాత మీ ఖర్మ అనేశారు.

బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్జీవీ !

ఈ వివాదంలో వర్మ టిక్కెట్ రేట్ల గురించి పోరాడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే వైసీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల్ని డీ మోరలైజ్ చేయడానికి ఆర్జీవీని ఓ టూల్‌గా ఉపయోగించుకున్నారు వైసీపీనేతలు. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలు ధియేటర్లలో విడుదలై.. రేట్లు పెంచుకునేంంత చించుకునేలా ఏం తీయడంలేదు. ఎక్కువగా ఓటీటీకే పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తన వాయిస్ తాను వినిపించడం ప్రారంభించారు. ఆర్జీవీ మాట్లాడటం ప్రారంభిస్తే ఎదుటి వారి దగ్గర సమాధానాలు ఉండటం కష్టమే. వితంతడవాదానికే వితండవాదం చేయగలరు. కానీ ఎదుటి వారి దగ్గర సమాధానాలు ఉండవు.

పోరాడితే పోయేదేం ఉంది.. బానిస సంకెళ్లు తప్ప !

సినిమా బాగోలేకపోతే టిక్కెట్ డబ్బులు వెనక్కిస్తారా అంటూ ఘనత వహించిన పేర్ని నాని వెటకారంగా ఆడిగిన ప్రశ్నకు…, ఆర్జీ వీకూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఓటు వేసిన వారికి వైసీపీ పాలన బాగోలేదంటే ఏం చేస్తారంటే …, సమాధానం ఉండదు. ఏపీ ప్రభుత్వ పెద్దలు తాము మాత్రమే తెలివి గలవారమని అనుకుంటారు. కానీ అది వారి అతి తెలివి అనే విషయంపై వారికి స్పష్టత ఉండదు. ఆర్టీవీ లాంటి వారే చెబుతూ ఉండాలి. ఇప్పుడు ఆర్జీవీ ఇండస్ట్రీని మేల్కొలిపే ప్రయ.త్నం చేస్తున్నారు. మరి మేలుకుంటుందా? ఇండస్ట్రీ తనను తాను కాపాడుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకం.,

ప్రజల కోసం కాదు.. బతుకునిచ్చిన ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ముందుకు రాలేరా ?

తమిళ హీరోలు కావొచ్చు.. కన్నడ హీరోలు కావొచ్చు..ఇంకో భాష హీరోలు కావొచ్చు ఎవరైనా కానీ.., తమరాష్ట్రానికి సబంధించి ఏమైనా సమస్య వస్తే ఏకతాటిపైకి వస్తారు. కానీ విచిత్రం ఏమిటో తెలుగు చిత్ర పరిశ్రమలో రాష్ట్రం కోసం కాదు కదా.. .. చివరికి తమ చిత్ర పరిశ్రమపైకి దండెత్తి వచ్చినానోరు మెదపలేకపోతున్నారు. ఇంత కాలం తాము బతికిన ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూంటే గుడ్లప్పగించి చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close