” కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ” .. ఆర్జీవీ కొత్త సినిమా..!

రామ్‌గోపాల్ వర్మ పూర్తిగా.. రాజకీయ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఆయనకు రాజకీయం వంట బట్టేసింది. కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ… ఓ పోస్టర్ రిలీజ్ చేసి… ఆంధ్రులను బూతులు తిడుతూ.. ఓ పాట రిలీజ్ చేశారు. కేసీఆర్ బయోపిక్ తాను మాత్రమే తీయగలనంటూ.. కాస్త హడావుడి చేశారు ఇప్పుడు… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను.. ఏపీలో రిలీజ్ చేసుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. ఈ నెల 31వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు రావడంతో… ఆ సినిమాపై క్రేజ్ పోయింది. పైగా.. ఇప్పటికే.. ఏపీ మినహా ఇతర చోట్ల విడుదలయింది. స్వయంగా సినిమాకు సంబంధించిన వ్యక్తులే… సోషల్ మీడియాలో వర్జినల్ ప్రింట్లు సర్క్యూలేట్ చేశారనే ప్రచారమూ జరిగింది.

అయితే …ఆ సినిమా నుంచి ఇంకా పబ్లిసిటీ రాబట్టుకునేందుకు ఆర్జీవీ ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా.. గతంలో ఆయన… విజయవాడలోని… నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని హడావుడి చేశారు. అప్పుడు పోలీసులు వెనక్కి పంపేశారు. మరోసారి ఫలితాలు వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నమే చేశారు. కానీ పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో.. ప్రైవేటు ప్లేస్‌లో… ప్రెస్‌మీట్ పెట్టి.. రాజకీయ ప్రసంగం చేశారు. అందులోనే.. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమాను ప్రకటించారు. సినిమాను తీస్తారో… చాలా సినిమాల్ోల ప్రకటనలకే పరిమితం చేస్తారో కానీ… టైటిల్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న కులవిభజన కారణంగా… ఆర్జీవీ… ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్జీవీ.. గతంలో రాజకీయాలపై పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం… పక్కా వైసీపీ నేతల్లా మాట్లాడుతున్నారు. సైకిల్ టైరుకు పంక్చర్ అయిందంటున్నారు. హామీలు అమలు చేయకపోవడం వల్లే.. చంద్రబాబు ఓడిపోయారంటున్నారు. అలాగే… జనసేనతో పోలిస్తే పీఆర్పీ బాహుబలి అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. జనసేనకు ఒక్క సీటే రావడం… పీఆర్పీకి పద్దెనిమిది సీట్లు రావడంపై… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close