50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా – మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర – బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా – మిహిక‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఒక్క‌టైపోయారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రుగుతున్న పెళ్లి కావ‌డంతో.. ద‌గ్గుబాటి కుటుంబం అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లూ తీసుకొంది. కేవ‌లం 50 మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయి. అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌లో పాలుపంచుకున్నారు. టెక్నాల‌జీ పుణ్య‌మా అని రెండొంద‌ల కుటుంబాలు ఈ పెళ్లిని లైవ్ లో వీక్షించాయి. వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో ఈ పెళ్లిని ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు ఇళ్ల‌లోనే ఉండి వీక్షించారు. వారం రోజుల నుంచీ.. రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగుల‌న్నీ ఆపేశారు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క కార్య‌క్ర‌మ‌మూ జ‌ర‌గ‌లేదు. స్టూడియో మొత్తం శానిటైజేష‌న్ చేశారు. పెళ్లికి హాజ‌రైన ప్ర‌తీ అతిథికీ ఓ యాప్ ఇన్ స్టాల్ చేయించి, అందులో ఆరోగ్య స‌మాచారాన్ని నిక్షిప్తం చేయించారు. కొద్దిసేప‌టి క్రితం అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌లు వివాహ వేడుక‌కు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌భాస్ కూడా పెళ్లికి హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. క‌రోనా బారీన ప‌డ‌డంతో రాజ‌మౌళి కుటుంబం ఈ పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close