50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా – మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర – బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా – మిహిక‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఒక్క‌టైపోయారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రుగుతున్న పెళ్లి కావ‌డంతో.. ద‌గ్గుబాటి కుటుంబం అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లూ తీసుకొంది. కేవ‌లం 50 మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయి. అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌లో పాలుపంచుకున్నారు. టెక్నాల‌జీ పుణ్య‌మా అని రెండొంద‌ల కుటుంబాలు ఈ పెళ్లిని లైవ్ లో వీక్షించాయి. వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో ఈ పెళ్లిని ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు ఇళ్ల‌లోనే ఉండి వీక్షించారు. వారం రోజుల నుంచీ.. రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగుల‌న్నీ ఆపేశారు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క కార్య‌క్ర‌మ‌మూ జ‌ర‌గ‌లేదు. స్టూడియో మొత్తం శానిటైజేష‌న్ చేశారు. పెళ్లికి హాజ‌రైన ప్ర‌తీ అతిథికీ ఓ యాప్ ఇన్ స్టాల్ చేయించి, అందులో ఆరోగ్య స‌మాచారాన్ని నిక్షిప్తం చేయించారు. కొద్దిసేప‌టి క్రితం అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌లు వివాహ వేడుక‌కు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌భాస్ కూడా పెళ్లికి హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. క‌రోనా బారీన ప‌డ‌డంతో రాజ‌మౌళి కుటుంబం ఈ పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close