అమ్మాయిలూ.. పెప్ప‌ర్ స్ప్రే తీసుకెళ్లండి

దిశ ఘ‌ట‌న పై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. ఈ ఉన్మాదానికి సినిమాలు కూడా ఓ కార‌ణ‌మ‌ని, మితిమీరిన శృంగారం, అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్ల యువ‌త పాడైపోతోంద‌ని వాదించేవాళ్లున్నారు. అలాంటివాళ్ల‌కు క‌థానాయిక‌లు ఘాటుగానే స‌మాధానం చెబుతున్నారు. దీనిపై తాజాగా రాశీఖ‌న్నా కూడా స్పందించింది.

“సినిమాల్లో చాలా మంచి చూపిస్తున్నారు. పెద్ద‌వాళ్ల‌ని గౌర‌వించండి. అమ్మానాన్న‌ల్ని బాగా చూసుకోండి అని చెబుతున్నారు. అవి ఎవ్వ‌రూ పాటించ‌రు. చెడు మాత్రం అంద‌రి దృష్టిలో ప‌డిపోతోంది. గ్లామ‌రెస్‌గా క‌నిపించ‌డం మా త‌ప్పు అన్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఏది స‌భ్య‌త‌? ఏది అస‌భ్య‌త‌? అనేదానికి ప్ర‌మాణాలేమైనా ఉన్నాయా? ఒక్కోసారి నిండుగా దుస్తులు వేసుకున్నా వేలు పెట్టి చూపిస్తారు. ఒక్కోసారి ఎంత త‌క్కువ బ‌ట్ట‌లేసుకున్నా అందంగానే ఉంటుంది. మితిమీరిన పోక‌డ‌లు అనేవి చూసే దృష్టిని బ‌ట్టే ఉంటాయి” అంటోంది. అంతేకాదు.. ఈనాటి అమ్మాయిల‌కు ఓ స‌ల‌హా కూడా ఇస్తోంది. బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు పెప్ప‌ర్ స్ప్రే తీసుకెళ్లండి… ఎవ‌రైనా చెడుగా ప్ర‌వ‌ర్తిస్తే వాళ్ల కంట్లో సూటిగా కొట్టండి… అంటోంది. అయితే ఇంట్లో అమ్మానాన్న కూడా పిల్ల‌ల‌కు కౌన్సిలింగ్ చేయాల‌ని, అమ్మాయిల్ని గౌరవించ‌డం ఎలాగో నేర్పించాల‌ని ఉప‌దేశిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close