బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 11మంది కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన వారికి ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఆర్సీబీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది.
బుధవారం సాయంత్రం జరిగిన ఈ తొక్కిసలాటలో ఆర్సీబీ ఫ్యాన్స్ 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టు ఐపీఎల్ విన్నర్ కావడంతో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు స్టేడియం వద్దకు లక్షలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈఘటనలో మరో 50 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు.
అయితే , ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ క్రికెటర్ మదన్ లాల్. ఆర్సీబీ రూ.100 కోట్ల పరిహారం చెల్లించాల్సిందేనంటూ డిమాండ్ చేశాడు.ఒకవైపు బయట ప్రజలు చనిపోతుంటే మరోవైపు స్టేడియం లోపల సంబురాలు చేసుకున్నారు.ఈ విషాద ఘటనకు ఆర్సీబీ-కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలీ. రూ.100 కోట్ల పరిహారం కూడా చెల్లించాలని కోరుతూ ఆ ఫ్రాంచైజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై బాధిత కుటుంబాలు దావా వేయాలన్నారు.
మదన్ లాల్ చేసిన ఈ కామెంట్స్ పై చర్చ జరుగుతుండగానే.. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 11మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. మృతుల కుటుంబాలకు 10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మేము చేసే ప్రతి పనిలోనూ మా అభిమానులు ఎల్లప్పుడూ గుండెకాయలా ఉంటారు.’’ అని ట్వీట్లో పేర్కొంది.