‘వి’ ప్లానింగ్‌… బెడ‌సి కొట్టిందా?

‘వి’ సినిమాని ‘అమేజాన్ ప్రైమ్‌’కి ఇచ్చేశాడు దిల్ రాజు. సెప్టెంబ‌రు 5న అమేజాన్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈలోగా.. ప్ర‌మోష‌న్లు మొద‌లెట్టారు. `వి` ట్రైల‌ర్‌తో… ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌నుకుంది చిత్ర‌బృందం. ట్రైల‌ర్ విడుద‌ల చేస్తూనే… ఈ సినిమాని `అమేజాన్‌`లో చూపిస్తున్నాం.. అనే విష‌యం స్ట్రాంగ్ గా ఫిక్స‌యిపోయేలా.. ఓ ప్లాన్ చేసింది. `వి` ట్రైల‌ర్ చూడాల‌నుకునేవాళ్లు అమేజాన్ సైట్ లోకి వెళ్లి, లాగిన్ అయ్యి, ఓ ఫొటో అప్ లోడ్ చేస్తే `వి` ట్రైల‌ర్ చూసేలా ఓ ఏర్పాటు చేసింది.

అయితే… ఈ ప్లాన్ బెడ‌సి కొట్టింది. ట్రైల‌ర్ చూడ్డానికి ఇంత త‌తంగం ఎందుకు? అంటూ చాలామంది విసుక్కుంటున్నారు. ఈ సినిమాని ట్రోల్ చేయ‌డం కూడా మొద‌లెట్టారు. నిజంగానే.. ప్రొసెజ‌ర్ ఫాలో అయిన చాలామందికి ట్రైల‌ర్ ప్లే కాలేద‌ట‌. దాంతో ఈ ఎపిసోడ్ మొత్తం కామెడీగా మారిపోయింది. ట్రైల‌ర్ చూడ్డానికే ఇంత హంగామా చేస్తే, సినిమా చూపించ‌డానికి ఇంకెంత చేస్తారో.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా కాకుండా.. నేరుగా, ఎప్ప‌టిలానే ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసేసుంటే బాగుండేదేమో అనుకుంటోంద‌ట చిత్ర‌బృందం. రేపో.. మాపో.. ట్రైల‌ర్ ని నేరుగానే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం ఏర్పాట్లు చేస్తోందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close