తెలంగాణ డీజీపీతో పూనంకౌర్ భేటీ..! ఏంటి మ్యాటర్..?

హీరోయిన్ పూనంకౌర్.. ట్వీట్ చేసినా.. పర్సనల్‌గా ఎవరినైనా కలిసినట్లు బయటకు వచ్చినా…. అది హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిశారు. కాసేపు చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశం రహస్యంగా జరిగింది. మీడియాకు తెలియనివ్వలేదు. కానీ డీజీపీతో పూనంకౌర్ సమావేశానికి సంబంధించి తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్‌ సమాచారాన్ని సేకరించింది. దాదాపుగా అరగంట సేపు… పూనంకౌర్.. డీజీపీ మహేందర్‌ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం.

కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించినందుకు ఆమె మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడానికి కలిశారని.. పూనంకౌర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ.. కత్తి మహేష్..మీడియాలో రచ్చ చేసినప్పుడు.. పూనంకౌర్.. కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. అవి కత్తి మహేష్‌ను ఉద్దేశించి అన్నట్లే ఉండటంతో.. ఆయన పూనంకౌర్‌పై కూడా ఆరోపణలు చేశారు. పూనం – పవన్‌లకు కలిపి అనేక ఆరోపణలు చేశారు. దీంతో పూనం అప్‌సెట్ అయ్యారు. ఈ వివాదం నుంచి తనను కాపాడాలని.. సోషల్ మీడియాలో పవన్‌కు మొరపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించారు.

ఆ తర్వాత కత్తి మహేష్‌కు కూడా ఆ వివాదాన్ని అంతటితో వదిలి పెట్టారు. కానీ.. పూనంకౌర్ మాత్రం.. కొత్త వెర్షన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్నారు. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా.. హింట్లు ఇస్తూ.. ట్వీట్లు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓ న్యూస్‌చానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కూడా.. తనకు అన్యాయం చేసిన వారిని ఎప్పటికైనా వదిలి పెట్టబోనని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు పూనంకౌర్.. కొత్తగా ఏదైనా పోరాటం మొదలు పెట్టబోతున్నారా…? దానికి సంబంధించి.. ఫ్యాన్స్ పేరుతో తనపై ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి.. రక్షణ కోసం… పోలీసుల వద్దకు వెళ్లారా అన్న చర్చ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close