నిత్య‌పై కోపంతోనే ఆ పాట తొల‌గించారా?

భీమ్లా నాయ‌క్ ఆల్బ‌మ్‌లో `అంత‌మిష్ట‌మేంద‌య్యా` పాట‌ సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ఈ పాట సినిమాలో లేదు. లెంగ్త్ స‌మ‌స్య‌ వ‌ల్ల ఈ పాట తీసేశామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈ పాట‌కు అంత స్కోప్ లేద‌ని కూడా అంది. నిజానికి ‘భీమ్లా.. ‘ లెంగ్తీ సినిమా ఏం కాదు. ర‌న్ టైమ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. పాటకూ స్పేస్ ఉంద‌క్క‌డ‌. నిజానికి హిట్ సినిమా పాట‌ల్ని… సినిమాలోంచి తొల‌గించడానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. స్టార్ సినిమాల్లో పాట పెడితే, లెంగ్త్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని ఎవ‌రూ అనుకోరు. పాట ప‌క్క‌న పెట్ట‌డానికి ఏదో ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

అది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాట‌లో ప‌వ‌న్ – నిత్య‌మీన‌న్‌ల‌పై తెర‌కెక్కించారు. చిత్ర‌బృందంలోని ఓ ముఖ్య‌మైన స‌భ్యుడికీ, నిత్య‌కీ మ‌ధ్య చిన్న‌పాటి క్లాష్ వ‌చ్చింద‌ని, నిత్య‌పై కోపాన్ని ఎలా చూపించాలో తెలీక‌…ఆ పాట కత్తిరించార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ‘భీమ్లా నాయ‌క్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో నిత్య క‌నిపించ‌లేదు. స‌క్సెస్ మీట్ కి రాలేదు. ప్ర‌మోష‌న్లు స‌రేస‌రి. ‘భీమ్లా..’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ స‌మ‌యానికి నిత్య హైద‌రాబాద్ లోనే ఉంద‌ని, అయినా స‌రే, రాలేద‌ని మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే నిత్య‌కీ, ఈ టీమ్ లో ఓ కీల‌క‌మైన స‌భ్యుడికీ ఏదో అయ్యే ఉంటుంద‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close