కొడాలి, పేర్ని చేసిన తప్పేంటి!?

ప్రస్తుత మంత్రివర్గాన్ని చూసిన తరవాత ఎవరికైనా కొడాలి నాని, పేర్ని నానిలు చేసిన తప్పేంటి? వారిని ఎందుకు తొలగించారన్న చర్చ సహజంగానే వస్తోంది. వైసీపీలోనూ జరుగుతోంది. ఏపీలో కొడాలి నాని మంత్రి కాదు అంటే చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో విపక్షాలపై రాజకీయం చేశారు. పౌరసరఫరాల మంత్రిగా ఉన్నా.. ఆయన తన శాఖపై ఎప్పుడూ సమీక్షలు చేయడం.. మాట్లాడటం లాంటివి చేయలేదు. టీడీపీపైకి ముఖ్యంగా చంద్రబాబుపై ధూషణల రాజకీయంలో చేయడంలో మాత్రం ఆయన ఎవర్నీ నిరాశపర్చలేదు. హైకమాండ్ ఎలా విమర్శించమంటే అలా విమర్శించేవారు. జగన్‌పై అత్యంత విధేయత చూపేవారు. జగన్ కారు డ్రైవర్‌గా పని చేయడానికి కూడా సిద్ధమని చెప్పేవారు.

అలాంటిది ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి అవసరం లేదని జగన్ భావించారని అంటున్నారు. అంత విధేయత చూపిన వాళ్లకీ కులం కోటాలోనే ప్రాధాన్యం ఇస్తారా ? సొంత మనిషిగా పక్కన పెట్టుకోలేరా ? పేర్ని నాని తన శాఖతో పాటు రాజకీయాలపైనా సమర్థంగా పని చేశారని చెప్పుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సమర్థించడంలో ఆయన స్టైల్ వేరు. ఆయన మంచి వాగ్ధాటి ఉన్న నేత . ఆయనను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు.

పేర్ని నాని తనను తాను వైఎస్ కుటుంబానికి పెద్ద పాలేరునని ప్రకటించుకున్నారు. పార్టీకి.. ప్రభుత్వానికి తలలో నాలుకలా వ్యవహరించారు. ఆయన పదవిని ఎందుకు తప్పించారన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయం అనుకోవచ్చు. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడటంలో ఆయన స్టైలేవేరు. నిజానికి ఆయనకు సామాజిక సమీకరణం కూడా కలసి వస్తుంది. కానీ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాని పరిస్థితి. కారణాలేమైనప్పటికీ…. ఏపీలో మూడేళ్ల పాటు మంత్రులు అంటే పదే పదే తెర ముందుకు వచ్చిన ఇద్దరు నానిలు ఇప్పుడు తెర వెనక్కి వెళ్లాల్సిందే. వారికి ఏ ఇతర పదవులు ఇచ్చినా మంత్రి పదవులతో సాటి రావు. ఆ నానిలను జగన్ ఎవరి సలహాలతో దూరం చేసుకున్నారో ఆయనకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close