అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా… అస‌లు కార‌ణం ఇదే?

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనారోగ్యం నుండి దాదాపు కోలుకున్న‌ట్లే. పులి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని కేటీఆర్ గొప్ప‌గా చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ భ‌వ‌న్ కు రావ‌టం, పార్టీ నేత‌ల‌ను క‌లుస్తుండ‌టంతో అసెంబ్లీకి వ‌స్తార‌ని పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు.

కానీ, బ‌డ్జెట్ స‌మావేశాల ఫ‌స్ట్ డేనే కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఎందుకు రాలేద‌ని ఆరా తీయ‌గా పార్టీ వ‌ర్గాలు ఓ లాజిక్ చెప్తుంటే, అస‌లు విష‌యం మాత్రం ఇంకొటి ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

పార్టీ వ‌ర్గాల ప్ర‌కారం… అమావాస్య ముందుకు కేసీఆర్ బ‌య‌ట‌కు రార‌ని, ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ ఇదే ఫాలో అవుతున్నార‌న్న‌ది ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాట‌.

కానీ, అస‌లు నిజం మ‌రొక‌టి అనేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ జ‌రుగుతున్న చ‌ర్చ‌. సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుండే కేసీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య అస్స‌లు ప‌డేది కాదు. ఓడిపోయాక కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓడిపోయిన రోజు మ‌ర్యాద‌గా కూడా కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి రాజీనామా ప‌త్రం ఇవ్వ‌లేదు. ఓఎస్డీ ద్వారా పంపారు… నిజానికి ఇది గ‌వ‌ర్న‌ర్ ను అవ‌మానించ‌ట‌మే అని అప్ప‌ట్లో ప్ర‌జాస్వామ్యవాదులు ఫైర్ అయ్యారు.

తాజాగా, గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. గ‌వ‌ర్న‌ర్ ను వెల్ క‌మ్ చేసే స‌మ‌యంలోనూ, స్పీచ్ ముందు కూడా ఎదురు ప‌డాల్సి వ‌స్తుంది. కానీ, అది కేసీఆర్ కు ఇష్టం లేద‌ని అందుకే గ‌వ‌ర్న‌ర్ స్పీచ్ కు డుమ్మా కొట్టార‌ని, గ‌వ‌ర్న‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ దూరంగానే ఉంటార‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ పెట్టే రోజు మాత్ర‌మే కేసీఆర్ స‌భ‌కు హ‌జ‌రుకాబోతున్నార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close