ఆ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసు ఒక భారీ కుంభకోణంతో ముడిపడున్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మరి కొంత మంది కాంగ్రెస్ ప్రముఖులు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసులో అందరూ కోర్టుకి పూచీకత్తు చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారు. సామాన్య ప్రజలకే అటువంటి పరిస్థితి ఎదురయితే సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఈ కేసులో ముద్దాయిలుగా బెయిల్ పై విడుదలయిన వారు అందరూ ఈ కేసును చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. అందుకే వారు ఏమాత్రం సిగ్గు పడకకుండా ఆ కేసు పేరు చెప్పి పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేశారు. ఆ కేసును విచారిస్తున్న కోర్టు వరకు పాదయాత్రలు చేయాలనుకొన్నారు. ఆ కేసులో రాహుల్ గాంధి బెయిల్ తీసుకోకుండా జైలుకి వెళ్లాలని ఉవ్విళ్ళూరారు. ఆ కేసు పేరు చెప్పి డిల్లీలో పెద్ద హంగామా సృష్టించారు. తద్వారా దేశ ప్రజల దృష్టిని, సానుభూతిని ఆకర్షించాలని ప్రయత్నించారు. ఆ అవినీతి కేసుని కాస్తా ఏదో ఘనకార్యంలాగ చిత్రీకరించడంలో సఫలమయ్యారు.

ఆ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధి, మోతీలాల్ ఓరా, ఫెర్నాండెజ్, సుమన్ దుబేలకు ప్రత్యేక కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి నిన్న మినహాయింపునిచ్చింది లేకుంటే వారు ఆ కేసు పేరు చెప్పుకొని నిసిగ్గుగా ఇంకా ప్రచారం చేసుకొనే వారేమో. ఒక అవినీతి కేసులో ముద్దాయిలుగా ఉండి, బెయిల్ పై విడుదలయిన అటువంటి రాజకీయ నాయకులే ప్రజలకు, విద్యార్ధులకు, ప్రభుత్వానికి నీతి పాఠాలు వల్లించడం కేవలం భారత్ లోనే సాధ్యమేనేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close