తెలంగాణలో మద్యం దుకాణాలకు టోటల్ అన్‌లాక్..!

తెలంగాణలో మద్యం దుకాణాలకు అన్‌లాక్ చేసేశారు. ఇక నుంచి సాధారణంగానే మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ -3 నిబంధనలు ప్రకటించారు. స్కూళ్లు, సినిమాహాళ్లు తప్ప..దాదాపు అన్నీ సాధారణ కార్యకలాపాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ కూడా.. మందుబాబులకు కూడా… ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ లాక్ ప్రకటించేసింది.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నందున లాక్ డౌన్ ప్రకటించాలన్న డిమాండ్.. నిన్నమొన్నటిదాకా వినిపించేది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటి అవకాశం లేదని… తర్వాత తేల్చేశారు. తెలంగాణలో ఇక ఎలాంటి లాక్ డౌన్ నిబంధనలు అమల్లో లేనట్లే. కేంద్రం ఎప్పుడు అనుమతిస్తే.. అప్పుడు స్కూళ్లు, సినిమాహాళ్లు ప్రారంభమవుతాయి. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు.. తెలంగాణ సర్కార్‌కు ఆదాయం దండిగా వచ్చింది. అయితే.. ప్రజలకు ఆదాయం లేకపోవడంతో… తర్వాత కాస్త తగ్గింది. మళ్లీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

నిర్మాణ రంగంతో పాటు… వివిధ రకాల వ్యవస్థలు .. గాడిన పడుతున్నాయి. దీంతో… ప్రజల ఉపాధి కూడా పెరిగింది. మళ్లీ… మద్యం ఆదాయం కూడా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి మద్యం ఆదాయం.. మరింత కలసి వస్తోంది. ఇప్పుడు సాధారణ సమయాల్లో అమ్మకాలు చేయడం వల్ల… లాక్ డౌన్ ముందు నాటి ఆదాయం వస్తుందని… ప్రభుత్వం ఆశిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close