వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్లకు మేము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా.. అని వైసీపీ నేతలు నవ్విపోదురుగాక మాకేమిటి సిగ్గు అని వాదించేస్తున్నరాు. జగన్ రెడ్డి తన ట్వీట్ లో అదే చెప్పారు. బొత్స కూడా అదే అంటున్నారు. ప్రజలకు మరీ మతిమరుపు అని వీరు అనుకుంటున్నారో.. లేకపోతే.. మేమే అంతా మర్చిపోయామని చెప్పాలనుకుంటున్నారో కానీ వీళ్లను చూసి సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ ఐదేళ్లలో రాజకీయ కార్యక్రమాల కోసం బయటకు వస్తే అడ్డుకోని సందర్భమే లేదు. పోలీసులతో అడ్డుకోవడం ఓ ఎత్తు అయితే పార్టీ కార్యకర్తలతో రాళ్లు దాడులు చేయించేవారు. కుప్పం నుంచి మార్కాపురం వరకూ చంద్రబాబుపై ఎన్ని రాళ్ల దాడులు జరిగాయో లెక్కే లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తే.. స్టూల్ మీద నిలబడి మాట్లాడుతున్నారని స్టూల్ కూడా ఎత్తుకెళ్లేవారు. ఇక పవన్ కల్యాణ్ ను ఎన్ని సార్లు అడ్డుకున్నారో విశాఖ లాంటి ఘటనల వీడియోలు వైరల్ అవుతాయి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు అసలు హక్కులనేవి లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ. అయితే పోలీసులతో లేకపోతే పార్టీ కార్యకర్తలతో కుట్రలు చేసి.. ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని చూశారు. చంద్రబాబు ప్రాణానికి ముప్పు తలపెడతారని..భద్రతను కేంద్రం రెట్టింపు చేసింది. కమెండోలను పెంచింది. ఇప్పుడు జగన్ రెడ్డి స్వేచ్చగా జనంలోకి వెళ్తున్నారు. పోలీసులు చెప్పే సూచనలను పట్టించుకోకుడా.. జనాన్ని చంపేసి.. భద్రత ఇవ్వలేదని అంటున్నారు. వీరు అసలు ఏం మాట్లాడుతున్నారో..ఎలా సమర్థించుకుంటున్నారో చూసి.. కనీసం వారైనా సిగ్గుపడాలి కదా. అలాంటిదేమీ లేకుండా.. నవ్విపోదురుగాక అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.