వచ్చే నెల నుంచి పోరాటం షురూ అంటున్న రేవంత్

కొద్దిరోజుల కిందట, హైదరాబాద్లో సొంత ఆఫీస్ ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇకపై కేసీఆర్ సర్కారు మీద తన పోరాటం షురూ అన్నారు. కానీ, వెంటనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆ టాపిక్ పక్కనబెట్టేయాల్సి వచ్చినట్టుంది.  ఇప్పుడు త్వరలో తన మార్కు పోరాటం ప్రారంభమౌతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు.

సొంత నియోజక వర్గం కొడంగల్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కొడంగల్ ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారనీ, కానీ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా కేటాయించింది లేదనీ, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. భూకేటాయింపుల్లో, ఐటీ హబ్స్ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న శాఖల్లో అవినీతి చాలా జరిగిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నా అన్నారు. తండ్రీ కొడుకులు చేసిన అవినీతి మీద, వారు కొనుక్కున్న భూముల మీద, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల మీద, అక్రమ భూకేటాయింపుల మీద సమాచారమంతా సేకరించామన్నారు. ఇలాంటి వివరాలతో ఒక పుస్తకం ప్రచురిస్తా అన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తామన్నారు. కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసే అనుమతిని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇస్తారా లేదా, సుప్రీం కోర్టు తలుపు తట్టి ఈ కార్యక్రమాలు చెయ్యొచ్చా అనేది ఆలోచిస్తున్నామన్నారు.

రేవంత్ త్వరలో చేయబోయే ఆరోపణలన్నింటికీ నిర్దిష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయనే అంటున్నారు. అంతేకాదు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఒక్కోటిగా వచ్చే నెల నుంచి విడుదల చేస్తానని చెప్పారు. గతంలో కూడా ఇలానే ఓసారి పక్కా ప్రణాళికతో పోరాటానికి దిగుతున్నా అని రేవంత్ ప్రకటించిన సందర్భాలున్నాయి. గత నెలలోనే భారత్ బచావో కార్యక్రమం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సందర్భంగా కూడా రేవంత్ ఇలాంటి ప్రకటనే చేశారు. ఆ వెంటనే రాష్ట్రంలో తన పోరాటం మొదలౌతుందని ఢిల్లీలో చెప్పారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అవినీతీ ఆస్తులపై వచ్చే నెల నుంచి పోరాటం షురూ అంటున్నారు. ఇదైనా కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close