రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి ఇంకా సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చి నన్ను తిడుతున్నారని రైతునేస్తం కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ అన్నారు. ఎన్ని తిట్టినా తాను వాళ్లను పట్టించుకోననన్నారు. వాళ్లు తిట్టే తిట్లన్నీ నాకు ఆశీర్వాదంగా మారుతాయని.. తనపని తాను చేసుకుంటూ వెళ్తానని రేవంత్ అన్నారు.
కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని ఘోరంగా తిడుతున్నారు. కేటీఆర్ మరీ ఎక్కువగా తిడుతున్నారు. తమకు నోటీసులు ఇప్పిస్తోందని రేవంతేనని వాడు..వీడు అని సంబోధిస్తున్నారు. లొట్టపీసు సీఎం అంటున్నారు. ఏసీబీ విచారణ పూర్తి అయి తెలంగాణ భవన్ కు కూడా వచ్చిన తర్వాత కూడా తిట్లందుకున్నారు. పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి ..భయపడేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదువులు కొన్న వాడు ఎవడు లేడు అని ప్రసంగించారు.
రేవంత్ మాటలు పూర్తిగా గతంలో వైసీపీ నేతల మాటల్లా ఉంటున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అలా తిడితే ఆయనపై ఎంత కోపం ఉన్నా.. ప్రజలు హర్షించరు. కేటీఆర్ తాను తిట్టడమే కాకుండా.. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతోనూ బూతులు తిట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా తిట్టడం.. తిట్టడం అనే కాన్సెప్ట్ .. వైసీపీ నుంచి కేటీఆర్ నేర్చుకున్నారేమో కానీ.. దాని వల్ల రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదు కదా.. తీవ్ర నష్టం జరుగుతుందని రికార్డులు చెబుతున్నాయి.