లోక్‌సభ టిక్కెట్లలో బీసీలకు ప్రాధాన్యమిస్తామన్న రేవంత్ – సాధ్యమేనా ?

లోక్‌సభ అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లను బీసీలకు కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సీట్ల సర్దుబాటు సమయంలో కేటాయించలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీసీలకు తక్కువే సీట్లు కేటాయించారు.

ఈ సారి కూడా ఎంపీ సీట్ల విషయంలో అలాంటి పరిస్థితే వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉన్నది 17 పార్లమెంట్ సీట్లు. ఇందులో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వుు నియోజకవర్గంగా ఉంది. అంటే ఇక జనరల్ కేటగిరిలో పదకొండు స్థానాలు మాత్రమే ఉంటాయి.. వీటిలో ఐదారు అయినా బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ అన్ని చోట్లా బలమైన పోటీ దారులుగా ఓసీలే ఉన్నారు.

ఖమ్మంలో రెడ్డి లేదా ఖమ్మ వర్గానికి సీటు కేటాయించాల్సిందే. సోనియా పోటీ చేస్తేనే మినహాయింపు. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, మేడ్చల్, మహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేశారని అంటున్నారు. ఇక జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించగలరు. ఈ లెక్కన బీసీలకు ఆరేడు సీట్లు కేటాయించడం . రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సాధ్యం కాదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బలమైన నేతల కొరతే దీనికి కారణమని చెప్పే చాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close