కొత్తపలుకు : చాణక్యుడు కంటే కేసీఆరే గొప్ప..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ ప్రతి వారాంతంలో.. తన పత్రికలో రాసే..”కొత్తపలుకు” ఆర్టికల్‌లో ఈ సారి.. పూర్తిగా కేసీఆర్ వ్యూహాలను.. ఆయన తెలివి తేటలను.. ఆయన రాజకీయ వ్యూహాలను పొగడటానికే కేటాయించారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా… మొత్తంగా.. కేసీఆర్ ” కీర్తన”లకే తన సమయం కేటాయించారు. అటు ఆర్టీసీ సమ్మె, ఇటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో.. కేసీఆర్ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తన చేతికి మంటి అంటకుండా.. పూర్తిగా క్రెడిట్ కొట్టేశారో.. వివరణాత్మకంగా రాశారు.

ఆర్టీసీ బతికే సమస్యే లేదని.. జీతాలు ఇవ్వలేమని చెప్పిన కేసీఆర్… సమ్మెను తారస్థాయికి తీసుకెళ్లి.. కార్మికులకు ఉద్యోగాలు ఇక లేవన్న భావన కల్పించారు. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పుడు అందరికీ చల్లని కబురు చెప్పి.. పాలాభిషేకాలు చేయించుకున్నారు. అంతకు ముందు కేసీఆర్ పెట్టిన కష్టాలన్నింటినీ మర్చిపోయారు. ఇదే సందడిలో ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచారు. చేయాలనుకున్న రెండు పనులను కేసీఆర్ చేసేశారు. ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. అదే సమయంలో.. దిశ ఘటనపై మాట్లాడలేదని.. కేసీఆర్ ను అందరూ నిన్నటి వరకూ విమర్శించారు. కానీ ఎన్ కౌంటర్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆయనకు మైలేజ్ వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు.. సీఎం స్థాయిలో పర్మిషన్ రాకపోతే.. పోలీసులు కూడా ఏం చేయలేరని.. ఆర్కే చెబుతున్నారు.

ఈ పరిణామాలన్నీ… ఆర్కేకు అబ్బురంగా అనిపించాయి. అందుకే..” చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!..” అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం… వారి అభీష్టానికి అనుకూలంగా వ్యవహరించి… నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేసీఆర్.. గొప్ప పాలకుడిగా నిలబడుతున్నారంటున్నారు. అయితే … ఎన్‌కౌంటర్ నిర్ణయాన్ని మాత్రం ఆర్కే పరోక్షంగా వ్యతిరేకించారు. చట్టాలు, న్యాయవ్యవస్థ ఇంకేం చేయాలన్న ప్రశ్న అంతర్లీనంగా వేశారు. చట్టాలు చేసేవారే.. చట్ట ఉల్లంఘనకు మద్దతుగా మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్‌లో ఇబ్బందికర పరిణామాలు తెచ్చి పెట్టబోతున్నాయన్న విషయాన్ని చెప్పీచెప్పకనే .. ఆర్కే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close