ఆర్కే పలుకు : ఏపీ, తెలంగాణల్లో ప్రజలే షిండేలు !

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ముడి పెట్టి ఈ వారం ” కొత్తపలుకు” నింపేశారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. అయితే తన ఆర్టికల్ మొత్తం మీద బీజేపీని ఎక్కడా పెద్దగా తప్పు పట్టలేదు. వారి రాజకీయం వారు చేస్తున్నారని.. కానీ చాన్స్ ఇస్తోందని మాత్రం పార్టీల అధినేతలేనని విశ్లేషించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే ఉద్దవ్ ధాకరే ఎవర్నీ కలవకపోవడం.. పార్టీ నేతలను పట్టించుకోకపవడం వంటి కారణాల వల్ల ఎమ్మెల్యేలు దూరమయ్యారని.. ఈ విషయాన్ని గ్రహించి బీజేపీ షిండే రూపంలో అందర్నీ ఏకంగా చేసిందని తేల్చారు. ఈ విషయంలో తప్పు ఉద్దవ్ ధాకరేదేనని.. ప్రజాస్వామ్యంలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారని అర్కే చెబుతున్నారు

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఉద్దవ్ ధాకరే కన్నా ఎక్కువగా “ఆటిట్యూడ్” చూపిస్తున్నారని వారికీ షిండేలు ఎదురు కావొచ్చని ఆర్కే ఉదాహరణ పూర్వకంగా చెప్పారు. టీఆర్ఎస్‌లో ఏక్‌నాథ్ షిండే లాంటి నేతలు హరీష్ రావు, కేటీఆర్ అని తేల్చారు. మరో పవర్ సెంటర్‌గా సంతోష్ రావు ఉన్నా.. ఆయన నేరుగా రాజకీయం నుంచి రాలేదు కాబట్టి ఏమీ చేయలేరరని తేల్చారు. ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాలతో హరీష్ రావుకు మరింత మంచి ప్రాధాన్యత వస్తుందని ఆర్కే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో షిండే తరహాలోనే హరీష్ రావును దువ్వడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందట. కానీ హరీష్ రావు .. బుట్టలో పడకపోవడంతో వదిలేసిందని చెబుతున్నారు. తర్వాత చేస్తారో లేదో తెలియదు కానీ.. అప్పట్లో కేసీఆర్ హరీష్ ను దూరం పెట్టడానికి అదే కారణం అని ఆర్కే చెబుతున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌పై తిరుగుబాటు చేసే షిండేలు లేరని ఆర్కే అంచనా.

ఏపీకి సంబంధించినంత వరకూ తెలంగాణ పరిస్థితులే ఉన్నాయి. నెంబర్ టూ అంటూ ఎవరూ లేరు. జగన్ చుట్టూ తిరిగి పనులు చక్క బెట్టే సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు జన బలం లేదు. వాళ్లతో నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుబాటుప్రజల నుంచి వస్తుందని ప్రతి ఒక్క ఓటరు ఓ ఏక్ నాథ్ షిండే అవుతారని ఆర్కే చెబుతున్నారు. దానికి ఎన్టీఆర్ కాలం నాటి ఉదాహరణలను ఆర్కే చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాచరికం అమలు చేస్తామంటే ప్రజలు సహించరని ఆ విషయం ఎన్నో సార్లు రుజువైందని కొంత ఆర్కే చెబుతున్నారు.

మొత్తంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ధాకరే ఎంతగా ప్రజలకు .. పార్టీ నేతలకు దూరంగా ఉంటారో… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంతే ఉంటున్నారని ఆర్కే తేల్చారు. అయితే శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఉండవచ్చు కానీ.. తెలుగు రాష్ట్రాల్ోల ప్రజలు చేయబోతున్నారని చెబుతున్నారు. అదే జరుగుతుందని నిశ్చయంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close