ఆర్కే పలుకు : ఉన్మాదులు తయారయ్యారు !

ఓ వ్యక్తి ఏడుస్తూంటే సంతోషించే వారిని ఏమంటారు ?. ఉన్మాదులనే అంటారు. ఈ ఉన్మాదులను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోని ఓ వర్గం పెంచేస్తోందని.. కనీస మానవ విలువలు, కుటుంబ విలువలు కూడా తెలియకుండా చేసి రాజకీయంగా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చేసిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే విశ్లేషించారు. ప్రతీ వారాంతంలో ఆయన రాసే కొత్తపలుకుకు గత వారం విరామం ఇచ్చారు. ఈ సారి కూడా ఆయన రాయకపోయేవారేమో కానీ.. ఏపీ అసెంబ్లీ ఘటన తర్వాత మనసు మార్చుకుని అప్పటికప్పుడు రాసేశారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరికి .. పవిత్రమైన అసెంబ్లీలో జరిగిన అవమానం ఆయనను బాధ పెట్టినట్లుగానే రాశారు.

అయితే చంద్రబాబు ఏడుస్తూంటే సంతోషపడిన వాళ్లు ఇంకా చెప్పాలంటే ఆయనకు అలా జరగాల్సిందే అని అనే వాళ్ల పట్ల ఆర్కే జాలి చూపారు. ఏపీలో పడిపోతున్న కుటుంబ బంధాలకు ఇది సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. చంద్రబాబుపై వ్యాఖ్యలను సమర్థించేవారు తమ కుటుంబ సభ్యులపైనా అదే అభిప్రాయంతో ఉంటారని ఆయన చెబుతున్నారు. ఇలాంటి సైకోల్ని పెంచి రాజకీయంగా లబ్ది పొందుతున్న వారి వల్ల ఏపీ సమాజం నైతికంగా కూడా దిగజారిపోయిందని తన ఆర్టికల్‌లో అంతర్గతంగా ఆర్కే విశ్లేషించారు.

చంద్రబాబు మహా అయితే ఓ ఎన్నికల్లో మాత్రమే పాల్గొనగలరని.. తర్వాత ఆయన వయసు సహకరిస్తుందో లేదో తెలియదని ఇంతోటి దానికి ఆయనపై మానసిక దాడులు చేయడం ఏమిటని ఆర్కే ఆశ్చర్యపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డిది అత్యంత ప్రమాదకరమైన మైండ్ సెట్ అని.. దానికి ప్రజలు కూడా బలవ్వాల్సింేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆయన కుటుంబంలో ఆయనే చిచ్చు పెట్టుకుని తన రాజకీయాల కోసం తల్లీ, చెల్లిని దూరం చేసుకుని.. దానికీ చంద్రబాబునే నిందించడం అంటే ఎంత దారుణమైన మైండ్‌తో జగన్ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించడం.. ఓ ముఖ్యమంత్రిగా ఎంపీకి సంబంధంలేదని ప్రకటించడం దర్యాప్తును ఖచ్చితంగా ప్రభావితం చేసేదని తెలిసే జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు. దేశంలోనే అత్యంత దారుణమైన మానసిక స్థితి ఉన్న జగన్ ద్వారా ఏపీలో మరిన్ని దారుణాలు చూడబోతున్నామని ఆయన చెప్పకనే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close